NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    May 10, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.

    ఈ క్రమంలో నిరసన హింసకు దారితీయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరు మరణాలు నమోదయ్యాయి. డజన్ల కొద్దీ గాయపడ్డారు.

    నిరసనకారులు రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం ధ్వంసం చేసిన తర్వాత, లోపలికి ప్రవేశించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళన కార్యక్రమాలే జరిగాయి.

    ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కొన్ని ప్రదేశాల్లో హింసకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

    పాకిస్థాన్

    దేశవ్యాప్తంగా 144సెక్షన్ విధింపు

    పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టును సమర్థించింది.

    పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు.

    అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు.

    మే 1న రావల్పిండిలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఖాన్‌ను అరెస్టు చేశారు.

    ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన వెంటనే, అతని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు, ఫలితంగా దేశవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.

    పాకిస్థాన్

    ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి 

    ఇస్లామాబాద్‌ హైకోర్టు కాంప్లెక్స్ వెలుపల ఆర్మీ చిహ్నాలను ధ్వంసం చేసిన తర్వాత ఖాన్ మద్దతుదారులు రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేశారు.

    లాహోర్ కాంట్‌లోని కార్ప్స్ కమాండర్ ఇంట్లోకి చొరబడ్డారు. అతని ఇంటి వెలుపల ఉన్న వస్తువులను తగులబెట్టారు. పోలీసుల బారికేడ్లకు నిప్పంటించారు.

    పెషావర్‌లోని రేడియో పాకిస్థాన్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. అంతేకాకుండా రోడ్ల వెంబడి పీటీఐ నాయకులు టైర్లను తగులబెట్టారు.

    ఖైబర్ పఖ్తున్ఖ్వాలో సింధు రహదారిని మూసివేశారు. ఉన్నపాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ విమానాల ప్రతిరూపాన్ని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తగులబెట్టారు. ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని పాఠశాలలను మూసివేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    తాజా వార్తలు
    ఆర్మీ
    హైకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పాకిస్థాన్

    పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో క్రికెట్
    PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్ క్రికెట్
    ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్ జమ్ముకశ్మీర్
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి విమానం

    తాజా వార్తలు

    దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు  కరోనా కొత్త కేసులు
    జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం జమ్ముకశ్మీర్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  మణిపూర్
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025