Page Loader
Operation Sindoor: చైనా స్పందన.. భారత్, పాకిస్థాన్‌లకు శాంతి పిలుపు
చైనా స్పందన.. భారత్, పాకిస్థాన్‌లకు శాంతి పిలుపు

Operation Sindoor: చైనా స్పందన.. భారత్, పాకిస్థాన్‌లకు శాంతి పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై జరిపిన "ఆపరేషన్ సింధూర్" అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చైనా భారత్, పాకిస్థాన్‌లను శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది. చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, "ఈ ఉదయం భారతదేశం చేపట్టిన సైనిక చర్యలపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుత పరిణామాలపై దృష్టి పెడుతున్నాం. అన్ని రకాల ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తే చర్యలు తీసుకోకుండా, శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని భారత్, పాకిస్థాన్‌లను కోరుతున్నాం" అని పేర్కొన్నారు.

వివరాలు 

సైనిక చర్యలకు దూరంగా ఉండాలి:  ఐక్యరాజ్య సమితి  

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా,భారత దళాలు పాకిస్థాన్,పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై క్షిపణుల ద్వారా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ (జెఎం)బహవల్పూర్ కోట,లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)మురిద్కే స్థావరం వంటి ముఖ్య ఉగ్రవాద మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయి. భారత దాడులకు ప్రతిగా, పాకిస్థాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో భారీ కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను సన్నిహితంగా గమనిస్తోంది. మరింత సైనిక చర్యలకు దూరంగా ఉండాలని రెండు దేశాలను కోరుతోంది.