
#NewsBytesExplainer: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎటువైపు వెళుతోంది? ముస్లిం దేశాల వైఖరి ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని "అంతిమ పోరు"గా పేర్కొంటోంది. ఇరాన్ ఏకంగా ఇజ్రాయెల్ను ఈ భూమ్మీద నుంచే తుడిచిపెడతామంటోంది.
అంతేకాదు, అమెరికా కనుక ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది.
ఈప్రమాదకర పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ వైమానిక దళాల తాకిడులకు, ఇరాన్ శక్తివంతమైన క్షిపణుల ప్రతీకార దాడులకు మధ్య నేరుగా ఘర్షణ సాగుతోంది.
రెండు దేశాలకూ తీవ్ర నష్టాలు సంభవించినట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
యుద్ధం కొనసాగితే, ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలు కూడా గణనీయంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం: ప్రపంచానికి మరో షాక్
ఇప్పటికే ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ - హమాస్ పోరాటం లాంటి ఘర్షణలతో ప్రపంచం గందరగోళానికి లోనవుతోంది. ఈ నేపథ్యంలో, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆకస్మికంగా మొదలైన ఈ నూతన యుద్ధం ప్రపంచాన్ని మరోసారి షాక్కు గురిచేసింది. హమాస్పై దాడుల్లో క్రమంగా దూకుడుగా వ్యవహరించిన ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో మాత్రం ఏకంగా మొదటి దాడిలోనే భయానకమైన స్థాయికి వెళ్లింది. రెండవ రోజే సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసేందుకు యత్నించగా, ట్రంప్ ఆ ప్రయత్నాన్ని ఆపేశారని వినిపిస్తున్న కథనాలు ఉన్నాయి. టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించిన తరువాత ఆ దేశ రాజధాని మీద వర్షంలా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో నిర్వేఘంగా సంచరిస్తుండగా, మొదట అణుశక్తి కేంద్రాలను, అనంతరం ఇంధన సంబంధిత కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం గణనీయమైన పరిణామం. దీంతో ముస్లిం దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.
వివరాలు
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం: ప్రపంచానికి మరో షాక్
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం,ఇజ్రాయెల్ - హమాస్ పోరాటం లాంటి ఘర్షణలతో ప్రపంచం గందరగోళానికి లోనవుతోంది.
ఈ నేపథ్యంలో,ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఆకస్మికంగా మొదలైన ఈ నూతన యుద్ధం ప్రపంచాన్ని మరోసారి షాక్కు గురిచేసింది.
హమాస్పై దాడుల్లో క్రమంగా దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్.. ఇరాన్ విషయంలో మాత్రం ఏకంగా మొదటి దాడిలోనే భయానకమైన స్థాయికి వెళ్లింది.
రెండవ రోజే సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసేందుకు యత్నించగా,ట్రంప్ ఆ ప్రయత్నాన్ని ఆపేశారని వినిపిస్తున్న కథనాలు ఉన్నాయి.
టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించిన తరువాత ఆ దేశ రాజధాని మీద వర్షంలా దాడులు చేస్తోంది.
వివరాలు
ఇజ్రాయెల్ దాడులకు దీటుగా ఇరాన్
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో నిర్వేఘంగా సంచరిస్తుండగా, మొదట అణుశక్తి కేంద్రాలను, అనంతరం ఇంధన సంబంధిత కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం గణనీయమైన పరిణామం. దీంతో ముస్లిం దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.
ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు దీటుగా బదులిస్తోంది. సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ పై వరుస క్షిపణుల దాడులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు భారీ నష్టాలు సంభవించినప్పటికీ, ఆ వివరాలను వెల్లడించడంలో ఇజ్రాయెల్ నిరాకరించడంపై విమర్శలు ఉన్నాయి.
ఇరాన్ మొసాద్ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడి ఇజ్రాయెల్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అత్యాధునిక యుద్ధ విమానాలతో ఇరాన్ను అంతు చూద్దామనుకున్నఇజ్రాయెల్కు అనూహ్య స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది.
వివరాలు
ఇరాన్ - ఇజ్రాయెల్: శతృత్వానికి భౌగోళిక కారణాలేం లేవు
ఇరాన్ వద్ద ఉన్న ఖండాంతర క్షిపణులు లక్ష్యాన్ని సూటిగా తాకుతూ, ఇజ్రాయెల్ను అవాక్కు చేస్తున్నాయి.
కేవలం ఆరు రోజుల్లోనే యుద్ధం అత్యంత ఘోరంగా మారడం, త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ భౌగోళికంగా దగ్గరలో లేని దేశాలైనా, వాటి మధ్య పెరిగిన శత్రుత్వం మతపరంగా మరింత ముదిరింది.
సాధారణంగా దేశాలు భూమి కోసం యుద్ధం చేస్తుంటాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య పోరాటం మతం ఆధారంగా ఏర్పడినదే.
ప్రస్తుతం అణ్వాయుధాల అంశం కేవలం ఓ సాకు మాత్రమేనని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం.
వివరాలు
ఇరాన్: చమురు సంపదతో యుద్ధానికి నిధుల సమకూర్చే దేశం
ఇజ్రాయెల్తో పోరాటం చేయాలని ఇరాన్ బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తోంది.
దీనికితోడు, ఇరాన్ వద్ద విస్తారమైన చమురు వనరులున్నాయి. వాటి ద్వారా లభించే ఆదాయాన్ని యుద్ధ నిధులుగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఇజ్రాయెల్పై జరిగిన అన్ని యుద్ధాల్లో అరబ్ దేశాలు ఓడిపోయాయి.
అయితే, ఇటీవల ఆ దేశాలు తమ వైఖరిని మార్చుకున్నా, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై పోరాటానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్కు అతిపెద్ద శత్రువుగా మారింది.
ఇప్పటికే ఇరాన్ అణుబాంబులు కలిగి ఉందని అమెరికా, ఇజ్రాయెల్ అనుమానిస్తున్నాయి.
వివరాలు
ఆకస్మిక దాడులతో ప్రారంభమైన కొత్త చిచ్చు
ఇజ్రాయెల్ గత 20 ఏళ్లుగా ఇరాన్ అణుబాంబుల గురించి హెచ్చరిస్తూ వస్తోంది.
హమాస్తో ఏడాదిన్నరకు పైగా పోరాటం చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అకస్మాత్తుగా ఈ నెల 13న ఇరాన్పై విరుచుకుపడింది.
అమెరికాతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించలేదు.
ఈ విషయాన్ని అంచనా వేయడంలో ఇరాన్ ఘోరంగా విఫలమైంది.
ఈ దాడిలో ఇజ్రాయెల్ అత్యున్నత స్థాయి ఇరాన్ నాయకులను లక్ష్యంగా చేసుకుంది.
వారిలో టాప్ జనరల్స్, వైమానికదళ అధిపతులు, రక్షణ మంత్రి, అణుశాస్త్రవేత్తలు ఉన్నారు.
ఈ దాడిని ఊహించనందున పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఇరాన్ సైనిక, విత్తన వేదికల పైన కూడా భారీ నష్టం సంభవించింది.
వివరాలు
అమెరికా,యూకే మద్దతుతో పరిస్థితులు మరింత సంక్లిష్టం
ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించేదాకా వెనక్కి తగ్గదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికా మాత్రం ఇంతవరకు యుద్ధంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అయితే, అమెరికా తన యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యంలో మోహరించగా, యూకే సైనిక బలగాలను తరలించడం గమనార్హం.
ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
మూడో దేశం జోక్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
అంతేకాదు, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసేందుకు పక్కా వ్యూహం సిద్ధం చేసిందని చెబుతున్నారు.
వివరాలు
యుద్ధ ప్రభావంతో ఎయిర్పోర్టులు మూత.. ప్రయాణికులకు ఇబ్బందులు
ఈ యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని చాలా దేశాల్లో ఎయిర్పోర్టులు తాత్కాలికంగా మూసివేశారు.
వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇరుక్కుపోయారు. ఇరాక్, ఇరాన్, జోర్డాన్, లెబనాన్ దేశాల్లో ఎయిర్పోర్టులు మూతపడడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీ7 సదస్సు మధ్యలోనే విడిచి తిరిగి అమెరికాకు వచ్చారు. ఇది ఇరాన్పై మరింత దాడులు జరగనున్న సంకేతంగా ప్రచారం సాగుతోంది.
వివరాలు
అణ్వస్త్రాల దిశగా అమెరికా - ఇజ్రాయెల్ చర్యలు
ఇరాన్ ఒకవైపు అణ్వస్త్ర కార్యక్రమాలను కొనసాగిస్తూనే శాంతి చర్చలపై మాట్లాడుతుండటం సబబు కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించడమూ కీలక పరిణామంగా మారింది.
ఇది అమెరికా కూడా ఇరాన్పై దాడులకు పాల్పడే అవకాశాన్ని సూచిస్తోంది.
ఒకేసారి పెద్ద స్థాయిలో అణు కేంద్రాలను ధ్వంసం చేసే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వివరాలు
ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
ఇజ్రాయెల్ ప్రస్తుతం అనేక వైపుల నుంచి యుద్ధం సాగిస్తూ భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది.
గాజాతో ఏడాదిన్నరకుపైగా సాగుతున్న యుద్ధంతో పాటు, తాజాగా ఇరాన్తో ప్రారంభమైన పోరాటం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
సైనిక ఖర్చులు, సాధారణ ప్రభుత్వ వ్యయాలు రెట్టింపు అయ్యాయి. రిజర్వ్ సైనికుల నిర్వహణ భారంగా మారింది.
మొదటి 48 గంటల్లోనే ఇరాన్పై జరిపిన యుద్ధానికి ఇజ్రాయెల్ దాదాపు 1.45 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశ జీడీపీలో 7 శాతం వరకు రక్షణ వ్యయంగా వెచ్చిస్తున్న ఈ దేశానికి, యుద్ధం ముగిసిన తర్వాతా గణనీయమైన ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ఇరాన్కు మద్దతు ఎవరిచ్చారు?
ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, యూకే ముందుకు వచ్చినప్పుడు, ఇరాన్కు ఎవరు మద్దతుగా ఉంటారనేది కీలక ప్రశ్నగా మారింది.
ప్రస్తుతానికి కొన్ని శక్తివంతమైన సాయుధ గ్రూపులు మాత్రమే ఇరాన్కు మద్దతు ఇస్తున్నా, ముస్లిం దేశాలు బలంగా ఇరాన్ పక్షాన నిలుస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఉంది.
అనూహ్య పరిణామాలకు దారి తీసే ఈ యుద్ధం వల్ల ఎవరి ఊహకూ అందని పరిణామాలు జరుగుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.