NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్
    తదుపరి వార్తా కథనం
    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్
    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

    వ్రాసిన వారు Stalin
    Jun 27, 2023
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.

    జర్నలిస్టును వేధించడం ఆమోదయోగ్యం కాదని, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని వైట్‌హౌస్ పేర్కొంది.

    భారతదేశంలోని కొందరు వ్యక్తుల నుంచి సబ్రీనా సిద్ధిఖీ ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారని, వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని, దీనిపై వైట్‌హౌస్ స్పందించాలని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కెల్లీ ఓడొనెల్ డిమాండ్ చేశారు.

    దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ఆ వేధింపుల నివేదికల గురించి తమ దృష్టికి వచ్చినట్లు వైట్‌హౌస్ జాన్ కిర్బీ పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఎక్కడ ఎలాంటి వేధింపులు జరిగినా తాము కచ్చితంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అన్నారు.

    వైట్‌హౌస్

    ప్రధాని మోదీకి జర్నలిస్టు సిద్ధిఖీ వేసిన ప్రశ్న ఇదే

    భారత్‌లో ముస్లింలు, మైనారిటీల హక్కులను కాపాడటానికి, వాక్‌స్వేచ్ఛను మెరుగుపర్చేందుకు మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీకి వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు సబ్రీనా సిద్ధిఖీ ప్రశ్న వేశారు.

    జూన్ 23న వైట్‌హౌస్‌లో బైడెన్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రశ్న వేశారు.

    దీనికి మోదీ సమాధానం కూడా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని భారత్ శ్వాసిస్తోందని మోదీ అన్నారు. భారతీయుల సిరల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రవహిస్తుందని చెప్పారు.

    మానవ విలువలు, మానవ హక్కులు లేకపోతే ప్రజాస్వామ్యం లేదని మోదీ వెల్లడించారు. మనం ప్రజాస్వామ్యలో జీవిస్తున్నప్పుడు వివక్ష అనే ప్రశ్నకు తావులేదని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.

    మతం, కులం, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు లభిస్తాయని మోదీ సమాధానం చెప్పారు.

    వైట్‌హౌస్

    భారత్‌లో ఆన్‌లైన్ వేధింపులపై స్పందించిన జర్నలిస్టు సిద్ధిఖీ

    ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కులను 'రక్షించడానికి' తీసుకుంటున్న చర్యలపై ప్రధాని ధీటైన సమాధానం చెప్పి జర్నలిస్టు వేసిన ప్రశ్నను నిర్వీర్యం చేశారని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ఇది టూల్‌కిట్ ముఠాకు ఎదురుదెబ్బగా అభివర్ణించారు.

    అయితే జర్నలిస్టు సిద్ధిఖీ ఆన్‌లైన్‌లో తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఆమె టీమ్ ఇండియా టీ-షర్ట్ ధరించి, భారతదేశంలో జన్మించిన తన తండ్రితో ఇండియా క్రికెట్ జట్టుకు మద్దతు తెలుపుతున్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

    కొందరు తన వ్యక్తిగత నేపథ్యాన్ని టార్గెట్ చేశారని, అందుకే వారి కోసం ఈ పూర్తి చిత్రాన్ని షేర్ చేస్తున్నట్లు సిద్ధిఖీ ట్వీట్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా చేసిన ట్వీట్ 

    Prime Minister Modi completely destroyed the motivated question on steps being taken to ‘protect’ rights of Muslims and other minorities. In his response he didn’t mention Muslims or any other denomination, spoke about Constitution, access to Govt resources based on eligibility… pic.twitter.com/mPdXPMZaoI

    — Amit Malviya (@amitmalviya) June 22, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు సబ్రీనా సిద్ధిఖీ చేసిన ట్వీట్

    Since some have chosen to make a point of my personal background, it feels only right to provide a fuller picture. Sometimes identities are more complex than they seem. pic.twitter.com/Huxbmm57q8

    — Sabrina Siddiqui (@SabrinaSiddiqui) June 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైట్‌హౌస్
    నరేంద్ర మోదీ
    అమెరికా
    ప్రధాన మంత్రి

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    వైట్‌హౌస్

    వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్  అమెరికా
    భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్  అమెరికా
    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇండియా కారును నడుపుతున్న మోదీ.. రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి
    తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో ప్రధాన మంత్రి
    కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు  ప్రధాన మంత్రి

    అమెరికా

    కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ  కెనడా
    రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష  డొనాల్డ్ ట్రంప్
    అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి తుపాకీ కాల్పులు
    అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే  నరేంద్ర మోదీ

    ప్రధాన మంత్రి

    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025