NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్  
    తదుపరి వార్తా కథనం
    WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్  
    బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్

    WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    08:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ (Tedros Adhanom) తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.

    యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కే సమయంలో వైమానిక బాంబు దాడి జరిగింది.

    ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది.

    వివరాలు 

    విమానం ఎక్కే సమయంలో బాంబు దాడి

    ''ఐక్యరాజ్యసమితి ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు జరపడానికి, యెమెన్‌లో ఆరోగ్య పరిస్థితులు, మానవతా అంశాలపై అంచనాలు చేసేందుకు అక్కడికి వెళ్లాను. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసాము. సనాలో విమానం ఎక్కే సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మా విమాన సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. దాడి జరిగిన ప్రదేశానికి మా నుంచి కొన్ని మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను'' అని టెడ్రోస్‌ అధానోమ్‌ ఎక్స్‌ వేదికలో పేర్కొన్నారు.

    వివరాలు 

    యెమెన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం

    ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ (Antonio Guterres) ఖండిస్తూ, ''యెమెన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. సనా అంతర్జాతీయ విమానాశ్రయం, ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి. పౌరులపై, మానవతా కార్మికులపై దాడులు చేయకూడదు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం అత్యవసరం'' అని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

     హూతీలపై ఇజ్రాయెల్‌ లక్ష్యం 

    గురువారం ఇజ్రాయెల్‌ యెమెన్‌లోని సనా విమానాశ్రయం, నౌకాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది.

    హమాస్, హెజ్‌బొల్లా, సిరియాలోని అసద్‌ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో హూతీలు కూడా అదే నేర్చుకుంటారని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ దాడులు జరిగాయి.

    గత కొన్ని రోజులుగా హూతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు నిర్వహిస్తుండగా, ఇజ్రాయెల్‌ తమ లక్ష్యాన్ని హూతీలపై కేంద్రీకరించింది.

    తాజా దాడులను ఇతర సైనికాధికారులతో కలిసి నెతన్యాహు పర్యవేక్షించారని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఐక్యరాజ్య సమితి

    Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం స్నేహితుల దినోత్సవం
    పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి భారతదేశం
    UN Global Hunger Crisis: 10మందిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు: ఐరాస ఫుడ్ చీఫ్  ఆహారం
    'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025