అబుదాబీలో ప్రాణాంతక మెర్స్ వైరస్ కేసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ
మెర్స్కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)ప్రాణాంతక వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. అబుదాబీలో ఓ 28ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడ్డాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు బాధితుడు సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి పరీక్షించామని, వారిలో వైరస్ గుర్తించలేదని పేర్కొంది. UAE -అల్ఐన్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో స్థానిక ఆస్పత్రిలో చేరాడు. అనంతరం పీసీఆర్ పరీక్షల్లో మెర్స్కోవ్గా తేలింది. అతడికి సన్నిహితంగా ఉన్న 108 మందిని పరీక్షించగా ఎవరికీ వైరస్ సోకలేదని వెల్లడించింది. అయితే ఈ వైరస్ సోకితే జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. కొవిడ్ సంతతికి చెందిన మెర్స్కోవ్ ఇప్పటికే బ్రిటన్ అమెరికా సహా 27 దేశాల్లో కనిపించింది.