NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Mahindra: అమ్మకాల్లో దేశీయ దిగ్గజం మహీంద్రా హవా.. మార్చిలో భారీగా అమ్మకాలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mahindra: అమ్మకాల్లో దేశీయ దిగ్గజం మహీంద్రా హవా.. మార్చిలో భారీగా అమ్మకాలు!
    అమ్మకాల్లో దేశీయ దిగ్గజం మహీంద్రా హవా.. మార్చిలో భారీగా అమ్మకాలు!

    Mahindra: అమ్మకాల్లో దేశీయ దిగ్గజం మహీంద్రా హవా.. మార్చిలో భారీగా అమ్మకాలు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారులలో ఒకటైన మహీంద్రా, మార్చి 2025లో మొత్తం వాహన అమ్మకాల గణాంకాలను ప్రకటించింది.

    ప్రయాణికుల, వాణిజ్య, విద్యుత్ వాహనాలతో సహా మొత్తం 83,894 వాహనాలను విక్రయించామని, ఇది గతంతో పోల్చితే 23 శాతం వృద్ధిని సూచిస్తుందని తెలిపింది.

    యుటిలిటీ వెహికల్స్ విభాగంలో దేశీయ మార్కెట్లో 48,048 వాహనాలను విక్రయించగా, ఇది 18 శాతం వృద్ధిని సాధించింది.

    ఎగుమతులతో సహా మొత్తం 50,835 వాహనాలను విక్రయించామని, దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 23,951గా నమోదయ్యాయని సంస్థ వెల్లడించింది.

    వివరాలు 

    ఎస్‌యూవీ అమ్మకాల రికార్డు 

    మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరాన్ని మొత్తం 5,51,487 ఎస్‌యూవీల అమ్మకాలతో ముగించింది.

    ఇది కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక అమ్మకాలుగా నిలిచింది.

    ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు 20 శాతం వృద్ధిని సాధించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక వాహన రిజిస్ట్రేషన్లను నమోదు చేసిందని మహీంద్రా పేర్కొంది.

    వివరాలు 

    మార్చి నెల అమ్మకాల విశ్లేషణ 

    'మేం మార్చి నెలలో 48,048 ఎస్‌యూవీలను విక్రయించాం, ఇది 18 శాతం వృద్ధిని సూచిస్తుంది. అలాగే, అన్ని వాహన విభాగాలను కలిపి మొత్తం 83,894 వాహనాలను విక్రయించాం, గత ఏడాది అమ్మకాల కంటే 23 శాతం పెరుగుదల సాధించాం. అదనంగా, ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీల డెలివరీలను ప్రారంభించాం, ఇవి మార్కెట్లో బలమైన డిమాండ్‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది, దేశీయ మార్కెట్లో తొలిసారిగా 5 లక్షలకు పైగా ఎస్‌యూవీలను విక్రయించడం ద్వారా, మహీంద్రా గొప్ప ప్రగతిని సాధించింది' అని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ నక్రా అన్నారు.

    వివరాలు 

    మహీంద్రా గ్రూప్ గురించి 

    100 కి పైగా దేశాలలో 2,60,000 మంది ఉద్యోగులతో మహీంద్రా గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద బహుళజాతి కంపెనీలలో ఒకటిగా ఉంది.

    భారతదేశంలో వ్యవసాయ పరికరాలు, యుటిలిటీ వాహనాలు, సమాచార సాంకేతికత, ఆర్థిక సేవలలో ప్రముఖ స్థానం కలిగి ఉంది.

    వాల్యూమ్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది.

    అదనంగా, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో తన స్థిరమైన స్థితిని కొనసాగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మహీంద్రా

    Mahendra XUV300 : పనోరమిక్ సన్ రూఫ్, కొత్త ఫీచర్లలో మార్కెట్లోకి మహేంద్ర ఎస్‌యూవీ ఆటో మొబైల్
    మహీంద్రా BE.05 ఫీచర్లు సూపర్బ్.. లాంచ్ ఎప్పుడంటే?  ఆటో మొబైల్
    Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా  ఆటో మొబైల్
    ICC World Cup 2023: వరల్డ్ కప్‌కు స్పాన్సర్‌గా మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025