Page Loader
Upcoming SUVs: అద్భుతమైన ఫీచర్లతో త్వరలో లాంచ్ అయ్యే ఎస్‌యూవీలు ఇవే
అద్భుతమైన ఫీచర్లతో త్వరలో లాంచ్ అయ్యే ఎస్‌యూవీలు ఇవే

Upcoming SUVs: అద్భుతమైన ఫీచర్లతో త్వరలో లాంచ్ అయ్యే ఎస్‌యూవీలు ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో ఎస్‌యూవీ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఈ రంగంలో మహీంద్రా స్కార్పియో, మహీంద్రా థార్ (3-డోర్), మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా వంటి మోడల్‌లు ముందంజలో ఉన్నాయి. త్వరలో మరెన్నో వాహనాలు ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మహీంద్రా, టాటా మోటార్స్, MG మోటార్, ఫోర్స్ మోటార్స్ టయోటా నుండి త్వరలో ఆఫ్-రోడ్-సామర్థ్యం గల ఎస్‌యూవీలు భారత్ మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి. ప్రస్తుతం వాటి గురించి తెలుసుకుందాం. మహీంద్రా థార్ (5-డోర్లు) 2024 మధ్య నాటికి రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సింగిల్-పేన్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, అప్‌హోల్స్టరీని కలిగి ఉంది.

Details

ఫోర్స్ గుర్ఖాలో అద్భుత ఫీచర్లు

ఫోర్స్ గూర్ఖా (5-డోర్)లో కూడా అద్భుత ఫీచర్లతో రాబోతోంది. ఇందులో క్యాబిన్ స్పేస్ పెద్దగా ఉండనుంది. బహుముఖ సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు, మెరుగైన ఇన్‌గ్రెస్/ఎగ్రెస్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టొయోటా ఫార్చ్యూనర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 48V మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో 2.8-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. కొత్త డస్టర్, బొలెరో, సియెర్రా వంటి వాహనాలను 2025లో లాంచ్ చేయడానికి సన్మాహాలను చేస్తున్నారు. టాటా సియెర్రా ICE, EV వెర్షన్‌లతో రానుంది. ఇది ఎలక్ట్రిక్ మోడల్ డ్యూయల్-మోటార్ AWD పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది.