NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కాలుష్యం పన్నుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. ఇక డీజిల్‌ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్ 
    తదుపరి వార్తా కథనం
    కాలుష్యం పన్నుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. ఇక డీజిల్‌ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్ 
    డీజిల్‌ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్

    కాలుష్యం పన్నుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. ఇక డీజిల్‌ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 12, 2023
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయా వాహనాలపై 10 శాతం మేర కాలుష్యపు పన్నును ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు.

    వాటి విక్రయాలు నిరుత్సాహపరచాలన్న ఉద్దేశంతోనే అదనంగా మరో 10 శాతం మేర జీఎస్టీ విధించేందుకు యోచిస్తున్నామన్నారు. సియామ్‌ వార్షిక సదస్సులో భాగంగా మాట్లాడిన గడ్కారీ పొల్యూషన్‌ ట్యాక్స్‌ను ప్రవేశపెడతామన్నారు.

    దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయాలనుకుంటున్నట్లు చెప్పిన గడ్కారీ, వాయు కాలుష్యం తగ్గించాలన్నదే ట్యాక్స్ లక్ష్యమన్నారు.

    ఆటోమొబైల్‌ పరిశ్రమలు, డీజిల్‌ వాహన ఉత్పత్తులను తగ్గించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఉత్పత్తిని తగ్గించకుంటే, పన్ను విధించాల్సి వస్తుందని, అప్పుడు వాహనాలు విక్రయించడం ఇబ్బందికరమన్నారు.

    ఇప్పటికే దేశవ్యాప్తంగా డీజిల్‌ కార్ల సంఖ్య తగ్గిందన్నారు.

    DETAILS

    గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో పతనమైన షేర్ మార్కెట్లు

    పర్యావరణానికి డీజిల్‌ హాని కలిగిస్తోందని, ఫలితంగా తయారీ సంస్థలు వాటిని పూర్తిగా నిలిపేయాలని సూచించారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని వాహన తయారీ సంస్థలను కోరారు.

    ఇదే సమయంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    ప్రయాణికుల వాహన సెగ్మెంట్లో మారుతీ సుజుకీ, హోండా లాంటి కంపెనీలు డీజిల్‌ కార్ల తయారీని ఇప్పటికే పూర్తిగా నిలిపేశాయి.

    వాహనాలు ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ శ్లాబులోనే ఉండగా, వాహన రకాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు అదనపు సెస్సు విధిస్తున్ఎనాయి.

    ఇక ఎస్‌యూవీ(SUV)లకు గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్సును వసూలు చేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ ముంబై
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025