SEBI chief: సెబీ కొత్త చీఫ్గా తుహిన్ కాంత పాండే నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) కొత్త చీఫ్గా తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey) నియమితులయ్యారు.
ప్రస్తుతం రెవెన్యూ కార్యదర్శిగా (Revenue Secretary) విధులు నిర్వహిస్తున్న ఆయనకు సెబీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నియామకానికి గురువారం కేంద్ర నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
ఇదివరకు సెబీ చీఫ్గా ఉన్న మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch) మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పని చేశారు.
వివరాలు
సెబీ చైర్మన్గా నియమితమైన తొలి మహిళగా చరిత్ర
ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో పాండే కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రంగాలలో విశేష అనుభవం ఉంది.
కొత్తగా చేపట్టిన సెబీ చీఫ్ బాధ్యతలను ఆయన వచ్చే మూడు సంవత్సరాల పాటు నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు సెబీ చీఫ్గా విధులు నిర్వహించిన మాధాబీ పురీ బుచ్ను కేంద్రం 2022 ఫిబ్రవరి 28న నియమించింది. ఆమె మార్చి 2, 2022న పదవి బాధ్యతలు స్వీకరించారు.
సెబీ చైర్మన్గా నియమితమైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
గతంలో ఆమె ఐసీఐసీఐ సెక్యూరిటీస్ హెడ్గా సేవలు అందించడంతో పాటు, 2017-2021 మధ్య కాలంలో సెబీలో పూర్తి స్థాయి సభ్యురాలిగా పని చేశారు.
అయితే, సెబీ చీఫ్గా ఆమె మూడేళ్ల పదవీకాలం నేటితో ముగియనుంది.