NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SEBI: సెబీ  ఛైర్‌పర్సన్‌ పై కాంగ్రెస్‌ మరోసారి సంచలన ఆరోపణలు 
    తదుపరి వార్తా కథనం
    SEBI: సెబీ  ఛైర్‌పర్సన్‌ పై కాంగ్రెస్‌ మరోసారి సంచలన ఆరోపణలు 
    సెబీ ఛైర్‌పర్సన్‌ పై కాంగ్రెస్‌ మరోసారి సంచలన ఆరోపణలు

    SEBI: సెబీ  ఛైర్‌పర్సన్‌ పై కాంగ్రెస్‌ మరోసారి సంచలన ఆరోపణలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు (SEBI) ఛైర్‌పర్సన్‌ మాధవీ పురి బుచ్‌పై కాంగ్రెస్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.

    ముంబైలో మాధవీకి చెందిన ఒక ప్రాపర్టీని సెబీ దర్యాప్తు చేస్తున్న ఓ సంస్థకు అద్దెకు ఇచ్చినట్లు పేర్కొంది.

    ఈ అద్దె ద్వారా ఆమె ఆదాయం పొందుతున్నట్లు ఆరోపించిన కాంగ్రెస్‌ దీనిని అవినీతికి సంబంధించి వ్యవహారమని ఆరోపించింది.

    ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.

    వివరాలు 

     అద్దె రూపంలో మాధవీ మొత్తంగా రూ.2.16 కోట్లు పొందారు: పవన్‌ఖేడా 

    "ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదు. ఇది అవినీతికి సంబంధించిన కేసు. సెబీ సభ్యురాలిగా ఉన్నప్పుడు మాధవీ 2018-19లో క్యారల్‌ ఇన్‌ఫో సర్వీసెస్‌ అనే సంస్థకు ఒక ప్రాపర్టీని అద్దెకు ఇచ్చారు. ఈ సంస్థ అనుబంధంగా ఉన్న Wockhardt అనే కంపెనీపై సెబీ దర్యాప్తు చేస్తోంది. ఆ రెండు కంపెనీల ప్రమోటర్లు కూడా ఒకరే. 2018-19 నుంచి 2023-24 వరకు అద్దె రూపంలో మాధవీ మొత్తంగా రూ.2.16 కోట్లు పొందారని కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేడా చెప్పారు.

    సెబీకి సమగ్రత, జవాబుదారీతనం పతనమైందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నించారు.

    వివరాలు 

    ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతభత్యాలు

    2017 నుంచి 2021 వరకు సెబీ సభ్యురాలిగా పనిచేసిన మాధవీ, 2022 మార్చి 2న సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

    ఆమె సెబీలో చేరినప్పటినుంచి, ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతభత్యాలు అందుకున్నారని తెలిపింది.

    సెబీ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతూనే, అదే బ్యాంకు నుంచి ఆదాయం పొందారన్న విషయం ప్రధాని మోదీకి తెలుసా అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు.

    అయితే, 2013 అక్టోబర్ 31న ఆమె పదవీవిరమణ తర్వాత ఆమెకు ఎటువంటి వేతన చెల్లింపులు చేయలేదని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టంచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025