Page Loader
New India Co-op Bank: కో ఆపరేటివ్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు
కో ఆపరేటివ్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు కో ఆపరేటివ్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు

New India Co-op Bank: కో ఆపరేటివ్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కో-ఆపరేటివ్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో వారు బ్యాంకు వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.

వివరాలు 

ఆంక్షలు విధించిన ఆర్బీఐ 

ముంబై బాంద్రాలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (New India Co-op Bank)పై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 13 నుంచి ఈ బ్యాంకు ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయడం, పునరుద్ధరించడం, పెట్టుబడులు పెట్టడం, కొత్త డిపాజిట్లను స్వీకరించడం వంటి కార్యకలాపాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది.

వివరాలు 

ఖాతాదారులకు నిర్బంధం - గందరగోళం 

ప్రస్తుతం బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఖాతాదారులు తమ పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరించుకోకుండా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొన్ని ప్రత్యేక షరతుల ప్రకారం, ఖాతాదారులు తమ డిపాజిట్లపై రుణాలను ఆఫ్‌సెట్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అదనంగా, ఉద్యోగుల జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి అత్యవసర ఖర్చుల కోసం బ్యాంకు నిధులను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఆంక్షలు ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయని, అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

వివరాలు 

ఖాతాదారుల ఆందోళన - బ్యాంకు వద్ద ఉద్రిక్తత 

ఆర్బీఐ ఆంక్షల విషయాన్ని బ్యాంకు ఖాతాదారులకు తెలియజేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వృద్ధులు, మహిళలు తమ డిపాజిట్ పత్రాలతో హాజరయ్యారు. నగదు ఉపసంహరణ కోసం బ్యాంకు ఎదుట క్యూకట్టారు. అయితే, బ్యాంకు సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో ఖాతాదారులు మరింత అసహనానికి గురయ్యారు. ఈ పరిస్థితి గందరగోళానికి దారితీసింది. సమగ్ర సమీక్ష తర్వాత నిర్ణయం ఆర్బీఐ విధించిన ఆంక్షలు తాత్కాలికమైనవే అని, బ్యాంకు ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఖాతాదారులు పానిక్ అవాల్సిన అవసరం లేదని అధికారిక వర్గాలు సూచించాయి. ఖాతాదారులు తమ డిపాజిట్ల భద్రతపై అనుమానంతో ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్యాంకు దగ్గర ఆందోళనలో ఖాతాదారులు