GST 2.0: సాధారణ ప్రజలకు,రైతులకు శుభవార్త.. వీటి ధరలు తగ్గనున్నాయ్..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు ముఖ్యమైన సంస్కరణలకు ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొత్త స్లాబ్ రేట్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిర్ణయించారు. ఈ సంస్కరణల ప్రకారం 5%,18% స్లాబ్లు కొనసాగుతాయి. అయితే ఇప్పటివరకు ఉన్న 12%, 28% స్లాబ్లను తొలగించనున్నారు. ఇక లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించనున్నారు. ఈ మార్పులు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని సీతారామన్ తెలిపారు. అలాగే, కౌన్సిల్ మరోసారి సెప్టెంబర్ 4న సమావేశం కానుంది.
వివరాలు
ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
"సిన్ గూడ్స్" (సోడాలు, 50 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ కార్లు)పై 40% పన్ను విధింపు
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, చక్కెర కలిగిన గ్యాస్ పానీయాలపై 40% పన్ను
అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ మినహాయింపు
28% నుంచి 18%కి తగ్గిన వస్తువులు
సిమెంట్
300 సీసీలలోపు చిన్న కార్లు, మోటార్ సైకిళ్లు
బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు
అన్ని ఆటోపార్ట్స్
ఆటోరిక్షాలు
వివరాలు
18% స్లాబ్లోకి చేరిన వస్తువులు
ఎయిర్ కండిషనర్లు
అన్ని రకాల టెలివిజన్లు
డిష్ వాషింగ్ యంత్రాలు
చిన్న కార్లు
300 సీసీలలోపు మోటార్ సైకిళ్లు
18% నుంచి 5%కి తగ్గిన వస్తువులు
నమ్కీన్
భుజియా
సాస్
పాస్తా
ఇన్స్టంట్ నూడుల్స్
చాక్లెట్
కాఫీ
ప్రిజర్వ్డ్ మాంసం
వెన్న, నెయ్యి
5% కన్నా తక్కువగా పన్ను విధించనున్న వస్తువులు
అల్ట్రా హై టెంపరేచర్ పాలు
పనీర్
రోటీలు
పరాటాలు
వివరాలు
12% లేదా 18% నుంచి 5%కి తగ్గిన వస్తువులు
హెయిర్ ఆయిల్
సబ్బులు
షాంపూలు
టూత్ బ్రష్
టూత్ పేస్ట్
టేబుల్ వేర్
కిచెన్ వేర్
నూడుల్స్, పాస్తా, పలు ఆహార పదార్థాలు
రొటీలూ
సైకిళ్లు
పలు ఔషధాలు
మెడికల్ పరికరాలు
వ్యవసాయ పరికరాలు