LOADING...
Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌ 
బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌

Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి త్వరలోనే తాజా మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. ఇవి శుక్రవారం సాయంత్రంలోగా లేదా సోమవారం నాటికి విడుదలయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. పరపతి విధాన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఆర్‌ బి ఐ తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో భాగంగా, రూ.2.5 లక్షల లోపు బంగారు రుణాలపై లోన్‌-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని 75 శాతం నుంచి 85 శాతానికి పెంచుతున్నట్లు గవర్నర్‌ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సూచనల మేరకు ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం.

వివరాలు 

గవర్నర్‌ తాజా ప్రకటన పునాది రుణాల పరిశ్రమపై ప్రభావం

ఇంతకుముందే బంగారం తాకట్టు రుణాల విషయంలో బ్యాంకులు,ఎన్బీఎఫ్‌సీలకు (NBFCs) ఒకేలా నిబంధనలు ఉండేలా చూసేందుకు ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రుణ పరిమితి,తాకట్టు రుణ రకం, చెల్లింపు విధానాలు వంటి అంశాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. ఇదిలా ఉండగా, గవర్నర్‌ తాజా ప్రకటన పునాది రుణాల పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా బంగారం తాకట్టు పెట్టి రుణాలు మంజూరు చేసే కంపెనీలకు మద్దతు లభించింది. దీని ఫలితంగా మణప్పురం ఫైనాన్స్‌ షేరు ధర సుమారు 3 శాతం పెరిగి రూ.241 వద్ద ట్రేడవుతోంది. ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు ధర 5 శాతం వృద్ధితో రూ.2,412 వద్ద నిలిచింది.