
Gold Price: లక్ష దాటేసిన తులం బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం బంగారం ఎంతుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల క్రితమే బంగారం ధర లక్ష రూపాయల మార్కును అధిగమించింది.
ఆ తరువాత కొంతవరకు తగ్గుతూ వచ్చిన ధరలు,కొనుగోలు దారులకు స్వల్ప ఉపశమనం ఇచ్చాయి.
కానీ అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి వాతావరణం కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
ముఖ్యంగా గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల మరింత వేగం పుంజుకుంది.
ఫలితంగా పసిడి రేట్లు మరోసారి లక్ష రూపాయల మార్కును దాటి వెళ్లాయి.
తాజాగా శుక్రవారం (జూన్ 13) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,950 పెరిగింది.
అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,120 పెరిగింది.
వివరాలు
24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400
తాజా ధరల ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలు హైదరాబాద్,విశాఖపట్టణం, విజయవాడల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950గా ఉంది.
అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,400గా ఉంది.ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.93,100గా, 24 క్యారెట్ల ధర రూ.1,01,550గా నమోదైంది.
దీనికి జీఎస్టీతో పాటు ఇతర ఛార్జీలు కలిపితే తులానికి ధర మరింతగా పెరగవచ్చు.
ప్రాంతాన్ని బట్టి పసిడి రేట్లలో స్వల్ప మార్పులు ఉండటం సహజం. ఈ ఉదయం 10 గంటల వరకు పలు ప్రముఖ వెబ్సైట్లలో నమోదైన ధరల వివరాలివే.
వివరాలు
వెండి ధర ఏకంగా రూ.1,10,000
ఇంకోవైపు వెండి ధరలు కూడా పరుగులు పెడుతోంది.గత 10 రోజుల్లో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.
తాజా బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.1,100 పెరిగి రూ.1,10,000కు చేరుకుంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉండగా, అక్కడ కిలో వెండి ధర రూ.1,20,000గా ఉంది.
దేశంలోని ఇతర ప్రముఖ నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో కిలో వెండి ధర రూ.1,10,000గా కొనసాగుతోంది.
ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.