NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర 
    మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర

    Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిత్యం తగ్గుతూ వస్తున్నాయి.

    వరుసగా మూడో రోజు కూడా ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పసిడి కొనాలనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మంచి అవకాశం అని చెప్పవచ్చు.

    ఇటీవల బంగారం, వెండి రేట్లు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చాలామంది కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గారు.

    అటువంటి వారికి ఇప్పుడున్న ధరల తగ్గుదల ఒక బంగారు అవకాశంగా చెప్పవచ్చు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు అమలు నిర్ణయాన్ని వాయిదా వేసిన నేపథ్యం,ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి పరిస్థితులు సర్దుకుంటున్నాయి.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర.. 

    అంతేగాక, భూభాగ సంబంధిత ఉద్రిక్తతలు కూడా తగ్గుముఖం పడటంతో పెట్టుబడిదారులు పసిడి కాకుండా ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో బంగారంపై డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇదిలా ఉండగా, మే 29న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

    గ్లోబల్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. గత రోజుతో పోల్చితే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 80 డాలర్లు తగ్గింది.

    ప్రస్తుతానికి ఔన్స్ గోల్డ్ ధర సుమారు 3,250డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

    అదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర ఒక్క ఔన్స్‌కు 32.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర.. 

    ఇక రూపాయి విలువ ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూ.85.466 వద్ద స్థిరంగా ఉంది.

    హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా పసిడి ధరలు వరుసగా మూడోరోజూ పడిపోయాయి.

    మే 29న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 మేర తగ్గింది.

    చివరి మూడురోజుల్లో మొత్తం తగ్గుదల రూ.610 వరకు నమోదైంది.

    ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.97,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం ధర రూ.89,340గా కొనసాగుతోంది.

    వివరాలు 

    స్థిరంగానే వెండి ధర.. 

    పసిడి ధరలు తగ్గుతుండగా, వెండి మాత్రం తాత్కాలికంగా స్థిరంగా కొనసాగుతోంది.

    గత రోజులో కొద్దిగా తగ్గినప్పటికీ, మే 29న అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.1,11,000 వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగారం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బంగారం

    Gold:భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది?అక్కడి నుంచి ఎంత తేవొచ్చు?  బిజినెస్
    Gold Purity Test: బంగారం స్వచ్ఛతను ఇంట్లో ఎలా తనిఖీ చేయాలి?  లైఫ్-స్టైల్
    Gold rate: హోలీ వేళ పసిడి ప్రియులకు షాక్.. రూ. 1,200 పెరిగిన తులం గోల్డ్ ధర బిజినెస్
    Gold Rate: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట! ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025