NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం 
    రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం

    UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2025
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజుల్లో ఎటు చూసినా డిజిటల్ చెల్లింపులదే ఆధిపత్యం. చిన్న నుంచి పెద్ద మొత్తాల దాకా యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు జరిపే అలవాటు ప్రజల్లో బాగా పెరిగింది.

    గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి యాప్‌ల సాయంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో చెల్లింపులు జరుగుతున్నాయి.

    టీ స్టాల్‌లో రూ.10కి టీ తాగినా యూపీఐ స్కాన్ చేసి చెల్లించే స్థాయికి వినియోగదారులు చేరుకున్నారు.

    ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

    కానీ త్వరలోనే యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీలు (Merchant Charges) విధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం.

    వివరాలు 

    మళ్లీ మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధించే యోచన 

    యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టే అంశంపై కేంద్రం పునర్విచారణ జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

    వ్యాపారుల లావాదేవీ విలువ ఆధారంగా.. టర్నోవర్‌కు బదులుగా.. ఛార్జీలు వసూలు చేయాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ప్రత్యేకంగా రూ.3 వేలకుపైగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తించనున్న అవకాశముంది.

    చిన్న మొత్తాల చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఫీజులు ఉండకపోవచ్చని చెబుతున్నారు.

    ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA), ఆర్థిక సేవల విభాగం (DFS) ఉన్నతాధికారుల మధ్య చర్చల దశలో ఉన్నట్లు జాతీయ మీడియాలో వెల్లడైంది.

    వివరాలు 

    ఇంతకు ముందు రద్దు చేసిన MDR ఛార్జీలు 

    డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో యూపీఐ, రూపే (RuPay) ఆధారిత లావాదేవీలపై విధించే MDR ఛార్జీలను రద్దు చేసింది.

    ఇప్పుడు మళ్లీ వాటిని తీసుకురావాలన్న యోచనలో ఉన్నప్పటికీ, ఇది సాధారణ వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపదు.

    ఎందుకంటే యూజర్ల నుంచి ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయబోమని అధికారులు అంటున్నారు.

    కానీ వ్యాపారులు మాత్రం ఈ ఛార్జీల భారం వల్ల మళ్లీ నగదు చెలామణి వైపు మొగ్గు చూపవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    వివరాలు 

    రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు 

    యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ.

    భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ రంగంలో యూపీఐ ఒక విప్లవాత్మక మార్గం అయింది.

    ఈ ఏడాది మే నెలలో యూపీఐ ద్వారా రూ.25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.

    ఇది ఏప్రిల్ నెలలో నమోదైన రూ.23.94 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు ఐదు శాతం ఎక్కువ.

    వివరాలు 

    రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు 

    లావాదేవీల సంఖ్య ప్రకారం చూస్తే, మే నెలలో మొత్తం 1,867.7 కోట్లు చెల్లింపులు జరగ్గా, ఏప్రిల్‌లో ఇది 1,789.3 కోట్లుగా ఉంది.

    మొత్తంగా చూస్తే, గత ఏడాది ఇదే మే నెలతో పోలిస్తే యూపీఐ లావాదేవీల విలువలో 23 శాతం పెరుగుదల నమోదైంది.

    2024 మేలో నమోదైన మొత్తం లావాదేవీలు రూ.20.44 లక్షల కోట్లే కావడంతో, ఏడాది వ్యవధిలో ఇది స్పష్టమైన వృద్ధి అని NPCI వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూపీఐ

    తాజా

    UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం  యూపీఐ
    Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్ ఐసీసీ
    Motivation: 'రిజెక్షన్' బాధ పెడుతోందా? మీలో ధైర్యాన్ని నింపే ఐదు మార్గాలివే! ప్రేరణ
    Musk Vs Trump: 'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్‌ పశ్చాత్తాపం.. ఎలాన్ మస్క్

    యూపీఐ

    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌  యూపీఐ పేమెంట్స్
    UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి  యూపీఐ పేమెంట్స్
    New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే యూపీఐ పేమెంట్స్
    UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు! ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025