NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్ 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్ 
    హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్

    Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 11 శాతం పెరిగాయి.

    ఇందులో దిల్లీ ఎన్‌సీఆర్‌లో 32 శాతం వృద్ధి, హైదరాబాద్‌లో 3 శాతం వృద్ధి కనిపించింది.

    ఈ వివరాలు రియల్టీ సంస్థలు క్రెడాయ్‌, కొలియర్స్‌, లైసెస్‌ ఫొరాస్‌ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడయ్యాయి.

    సెప్టెంబర్‌ త్రైమాసికంలో గృహాలపై డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఇళ్ల సగటు ధరలు 15వ త్రైమాసికం నుంచి పెరుగుదల చూపిస్తున్నాయి.

    ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.11,000కి చేరినట్టు నివేదికలో పేర్కొనబడింది.

    వివరాలు 

    పట్టణాల వారీగా వివరాలు

    జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 32 శాతం వృద్ధి కనిపించింది. ఇందులో చదరపు అడుగు ధర రూ.11,438కి చేరింది.

    ఢిల్లీ తరువాత బెంగళూరులో 24 శాతం వృద్ధి నమోదైంది, చదరపు అడుగు ధర రూ.11,743గా నమోదైంది.

    హైదరాబాద్‌లో 3 శాతం వృద్ధి చోటుచేసుకుంది, ఇక్కడ చదరపు అడుగు ధర రూ.11,351గా ఉంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.11,040గా ఉంది.

    పుణెలో 10 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.9,890కి చేరింది.

    ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 4 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.20,438గా ఉంది.

    కోల్‌కతాలో కూడా 3 శాతం వృద్ధి నమోదైంది, ఇక్కడ చదరపు అడుగు ధర రూ.11,351గా ఉంది.

    వివరాలు 

    సానుకూల వాతావరణం

    చెన్నైలో అతి తక్కువ వృద్ధి 1 శాతం మాత్రమే ఉంది, చదరపు అడుగు ధర రూ.7,889గా నమోదైంది.

    అహ్మదాబాద్‌లో 16 శాతం పెరిగి, చదరపు అడుగు ధర రూ.7,640కి చేరింది.

    ఇళ్ల ధరల పెరుగుదల గృహ కొనుగోలుదారుల మధ్య సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ చెప్పారు.

    విక్రయాలు,ధరల పెరుగుదల అనేది సరఫరా,డిమాండ్‌కు సూచన అని లైసెస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ చెప్పారు.

    కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, లగ్జరీ ఇళ్ల విభాగం కొనసాగుతుందని పేర్కొన్నారు.

    ఎంఎంఆర్‌, పుణె, హైదరాబాద్‌ మార్కెట్లలో విక్రయాలు, సరఫరాలో స్థిరత్వం ఉందని, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, చెన్నై,టైర్-2 పట్టణాల్లో సరఫరా తగ్గిందని తెలిపారు.

    వివరాలు 

    పెట్టుబడుల పరిణామం

    ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆర్‌బీఐ విధానంలో సులభతరం, రెపో రేటు తగ్గింపుతో గృహ కొనుగోలుదారులకు త్వరలో ఉపశమనం లభిస్తుందని కొలియర్స్‌ ఇండియా సీఈవో బాదల్‌ యాగ్నిక్‌ అభిప్రాయపడ్డారు.

    రియల్టీ తరువాత ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలో ఏఐఎఫ్‌ల ద్వారా అత్యధికంగా రూ.27,815 కోట్లు ప్రవేశించాయి.

    ఇతర రంగాల్లో కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఏఐఎఫ్‌ పెట్టుబడులు రియల్‌ ఎస్టేట్‌లో భారీగా పెరిగాయి.

    రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ ప్రకారం, దేశంలోని రియల్టీ రంగంలో ఏఐఎఫ్‌ పెట్టుబడులు రూ.75,000 కోట్లకు చేరుకున్నాయి.

    వివరాలు 

    ఏఐఎఫ్‌ పెట్టుబడులు

    '2024-25 సెప్టెంబర్‌ త్రైమాసికంలో రియల్టీ రంగంలో రూ.75,468 కోట్లు ప్రవేశించాయి' అని అనరాక్‌ తెలిపింది.

    గత ఐదు సంవత్సరాలలో ఏఐఎఫ్‌ పెట్టుబడులలో కేటగిరీ 2 ఏఐఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

    రియల్‌ ఎస్టేట్‌లో భద్రతా కారణాల వల్ల ఏఐఎఫ్‌ పెట్టుబడులు అధికంగా ఉండటం గమనించదగిన విషయం అని గోల్డెన్‌ గ్రోత్‌ ఫండ్‌ సీఈవో అంకుర్‌ జైన్‌ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    హైదరాబాద్

    Race Course: మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌ స్థలానికి ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ? రేవంత్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ ఫోకస్.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు  భారతదేశం
    Crackers: దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి దీపావళి
    Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబ సభ్యులు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025