
Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ సూచీలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై తీవ్రంగా పడింది. సోమవారం ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.17 గంటలకు సెన్సెక్స్ 532 పాయింట్లు పడిపోగా, 81,875 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి 24,951 వద్ద కొనసాగుతోంది. జేకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, ఏఐఏ ఇంజినీరింగ్, కేఎస్బీ, హూస్టన్ ఆగ్రో ప్రోడక్ట్స్, కేర్ రేటింగ్స్ షేర్లు లాభాల్లో ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐయోన్ ఎక్స్ఛేంజ్, సన్ఫ్లాగ్ ఐరన్, ఓరియంట్ గ్రీన్ పవర్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
Details
చమురు ధరలు 2 శాతం పైగా పెరిగాయి
అన్నిరంగాల సూచీలు కూడా పడిపోయాయి. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంటుంటే, అందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి ద్వారా వస్తున్నాయి. ఈ జలమార్గం మూతపడితే భారత్లో చమురు ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నేటి ట్రేడింగ్లో అంతర్జాతీయంగా చమురు ధరలు 2 శాతం పైగా పెరిగాయి.
Details
డాలర్ పోలిస్తే మారకం విలుల స్వల్ప నష్టాల్లో
బ్రెంట్ క్రూడ్ ధర 2.7 శాతం పెరిగి బ్యారెల్ 79.12 డాలర్లకు చేరింది. యూఎస్ క్రూడ్ 2.8 శాతం పెరిగి బ్యారెల్ 75.98 డాలర్లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్ప నష్టాల్లో ఉంది. శుక్రవారం 86.59 వద్ద ముగిసిన రూపాయి నేడు 86.76 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆసియా-పసిఫిక్ ప్రధాన మార్కెట్లలో చైనాకు చెందిన షాంఘై సూచీ మినహా మిగతావన్నీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.59%, హాంగ్కాంగ్ 0.05%, షెంజెన్ 0.17%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.55%, న్యూజిలాండ్ ఎన్జెడ్ఎక్స్ 0.44% కుంగాయి.