NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Paytm: ఏఐ స్టార్టప్‌ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం 
    తదుపరి వార్తా కథనం
    Paytm: ఏఐ స్టార్టప్‌ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం 
    ఏఐ స్టార్టప్‌ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం

    Paytm: ఏఐ స్టార్టప్‌ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటియం (Paytm) మాతృసంస్థ 'వన్‌97 కమ్యూనికేషన్స్‌'.. ఏఐ స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది.

    తన యాప్‌లో కృత్రిమ మేధా ఆధారిత సెర్చింగ్‌ సేవలను అందించేందుకు ఈ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

    ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది.

    ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు తమ స్థానిక భాషల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు పొందగలరని వెల్లడించింది.

    వివరాలు 

    సమాచారాన్ని పొందడం,సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కృత్రిమ మేధా కీలక పాత్ర

    ఈ భాగస్వామ్యంపై పేటీఎం వ్యవస్థాపకుడు,సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ,''త్వరగా సమాచారాన్ని పొందడం,సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కృత్రిమ మేధా కీలక పాత్ర పోషిస్తోంది. పర్‌ప్లెక్సిటీ సహాయంతో మేము లక్షలాదిమంది వినియోగదారులకు ఏఐ శక్తిని అందిస్తున్నాం,ఇది ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేలా సహాయపడుతుంది.'' అని తెలిపారు.

    పేటీఎంతో భాగస్వామ్యంపై పర్‌ప్లెక్సిటీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అరవింద్‌ శ్రీనివాస్‌ సంతోషం వ్యక్తంచేశారు.

    వినియోగదారులు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా ఈ ఏఐ సేవలు సహాయపడతాయని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేటియం

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    పేటియం

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ ప్లాన్
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం ప్రకటన
    paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే  తాజా వార్తలు
    Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025