LOADING...
PhonePe: ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే
ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే

PhonePe: ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌ పే (PhonePe) ఇప్పుడు ఫీచర్‌ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఈ దిశగా కంపెనీ కీలకంగా అడుగులు వేసింది. తాజాగా, కన్వర్సేషన్ ఆధారిత ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన గప్‌చుప్‌ను (Gupshup) ఫోన్‌పే చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తులో, ముఖ్యంగా వచ్చే కొన్ని త్రైమాసికాల వ్యవధిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్‌ ఫోన్ల కోసం సొంత యూపీఐ ఆధారిత మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు ఫోన్‌పే వెల్లడించింది. గప్‌చుప్ ప్లాట్‌ఫామ్‌తో కలిపి జీఎస్‌ పే (GS Pay) కూడా ఇందులో కీలక పాత్ర పోషించనుంది.

వివరాలు 

జీఎస్‌ పే UPI 123PAY సాంకేతికతను ఆధారంగా చేసుకుని పని చేస్తుంది

జీఎస్‌ పే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన UPI 123PAY సాంకేతికతను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. ఇది ఫీచర్ ఫోన్ల వినియోగదారులకు యూపీఐ సేవలు అందించడంలో సహాయకారిగా ఉంటుంది. ఫోన్‌పే రూపొందిస్తున్న కొత్త యాప్ ద్వారా పీర్-టు-పీర్ (P2P) లావాదేవీలు,ఆఫ్‌లైన్ క్యూఆర్ కోడ్ చెల్లింపులు,మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఆధారంగా చెల్లింపులు వంటి సౌకర్యాలు లభించనున్నాయి. ఫలితంగా,ఫీచర్ ఫోన్ వినియోగదారులు కూడా స్మార్ట్‌ ఫోన్ యూజర్లతో సమానంగా డిజిటల్ చెల్లింపులు చేయగలగనున్నారు.

వివరాలు 

నోకియా వంటి కొన్ని ఫీచర్‌ ఫోన్లలో గప్‌చుప్ యాప్

ప్రస్తుతం, నోకియా వంటి కొన్ని ఫీచర్‌ ఫోన్లలో గప్‌చుప్ యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో ఎస్ఎంఎస్ ఆధారంగా ఖాతా నంబర్‌ను లింక్ చేసుకునే సదుపాయం ఉంది. యూజర్లు 'పే' ఆప్షన్‌ ద్వారా మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఉపయోగించి చెల్లింపులు నిర్వహించవచ్చు. ఇక త్వరలోనే అదే స్థానంలో ఫోన్‌పే సొంతంగా అభివృద్ధి చేసిన కొత్త యాప్‌ను విడుదల చేయనుంది. దీని ద్వారా ఫీచర్‌ ఫోన్ వినియోగదారులకు సులభంగా డిజిటల్ చెల్లింపులను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్‌ నిగమ్‌ స్పష్టంచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫీచర్‌ ఫోన్లలోనూ ఫోన్‌పే!