NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: దెబ్బతీసిన ట్రంప్‌ ప్రకటన.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: దెబ్బతీసిన ట్రంప్‌ ప్రకటన.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు
    దెబ్బతీసిన ట్రంప్‌ ప్రకటన.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు

    Stock market: దెబ్బతీసిన ట్రంప్‌ ప్రకటన.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాల ప్రభావంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి.

    చైనాకు వ్యతిరేకంగా 104 శాతం టారిఫ్‌లను అమలు చేయాలన్న నిర్ణయంతో ఆసియా, అమెరికా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలోని ఈ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

    ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

    వివరాలు 

    రూపాయి విలువ 86.45

    ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 445.67 పాయింట్లు పడిపోయి 73,781 వద్ద ట్రేడవుతోంది.

    నిఫ్టీ కూడా 162 పాయింట్లు కోల్పోయి 22,373 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు తగ్గి 86.45 వద్ద ఉంది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు.

    ఈ సమీక్షలో వడ్డీ రేట్లు 0.25 శాతం మేర తగ్గించే అవకాశముంది.ఇక మరోవైపు, బీజింగ్‌ నుండి వచ్చే దిగుమతులపై అమెరికా ప్రభుత్వం భారీగా 104 శాతం టారిఫ్‌లను విధించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

    వివరాలు 

    ఏప్రిల్ 9 నుండి అమలులోకి..

    ఈ నిబంధనలు అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి.

    ఈ టారిఫ్‌ బాంబ్‌తో సోమవారం మార్కెట్లు బ్లాక్ మండేను ఎదుర్కొన్నాయి.అయితే మంగళవారం మార్కెట్లు కొంతవరకు కోలుకొని లాభాలతో ముగిశాయి.

    కానీ చైనాపై విధించిన టారిఫ్‌లు మరింత పెరగడం వల్ల ఆ సానుకూలత ఎక్కువ కాలం నిలవలేదు.

    ఈ పరిస్థితుల్లో కొన్ని షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

    పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు లాభాల్లో ఉండగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, జియో ఫైనాన్షియల్, హిందాల్కో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    స్టాక్ మార్కెట్

    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు జంప్‌ బిజినెస్
    Stock Market: భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌..! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025