NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300  
    రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300

    Stock market: రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.

    మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో పాటు మరికొన్ని దేశాలపై సుంకాలను ప్రకటించనుండగా, ఈ తరుణంలో మన మార్కెట్‌ సూచీలు బలంగా ముగియడం విశేషం.

    సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పెరిగి, నిఫ్టీ 23,300 పైన ముగిసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 1.30 గంటలకు ట్రంప్‌ తన నిర్ణయాన్ని వెల్లడించనుండగా, వెంటనే సుంకాలు అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం ప్రకటించింది.

    వివరాలు 

    డాలరుతో రూపాయి మారకం విలువ 85.51

    సెన్సెక్స్‌ 76,146.28 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,024.51) లాభాలతో ప్రారంభమైంది.

    ప్రారంభంలో కొంత మిశ్రమ ధోరణి కనబరిచినప్పటికీ, చివర్లో కొనుగోళ్ల మద్దతుతో మంచి లాభాలు నమోదయ్యాయి.

    ఇంట్రాడేలో 76,064.94- 76,680.35 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ, చివరికి 592.93 పాయింట్ల లాభంతో 76,617.44 వద్ద స్థిరపడింది.

    నిఫ్టీ 166.65 పాయింట్లు పెరిగి 23,332.35 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.51గా ఉంది.

    వివరాలు 

    అంతర్జాతీయంగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.21 డాలర్లు

    సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, టైటాన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా షేర్లు ముఖ్యంగా బలంగా రాణించాయి.

    నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

    అంతర్జాతీయంగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.21 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు 3163 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    స్టాక్ మార్కెట్

    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. నిఫ్టీ @22,550  బిజినెస్
    Stock market: ట్రంప్ విధానాల ప్రభావం.. భారీ నష్టాల్లో టాప్ 100 కంపెనీల షేర్లు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం ఐపీఓ క్యాలెండర్.. మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే కంపెనీలు ఇవే! ఐపీఓ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025