Page Loader
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో, వరుసగా మూడో రోజూ మార్కెట్‌ లాభాలను చవిచూసింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఎల్‌ అండ్‌టీ షేర్లు సూచీలకు పుష్కలమైన దృష్టిని అందించాయి. జీడీపీ వృద్ధి మందగించడంతో, ఈసారి ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించకపోయినా, సీఆర్‌ఆర్‌ తగ్గించే అవకాశముందని ఉన్న అంచనాలతో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ మంచి ప్రదర్శన కనబరిచాయి. దీంతో నిఫ్టీ 24,450 పాయింట్ల వద్ద ముగిసింది.

వివరాలు 

ఇంట్రాడేలో 80,949.10 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది

సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 80,529.20పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. కాసేపట్లో, సూచీ భారీ లాభాల్లోకి వెళ్లింది. రోజంతా ఆ లాభాలు కొనసాగించాయి. ఇంట్రాడేలో 80,949.10 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి, సెన్సెక్స్‌ 597.67 పాయింట్ల లాభంతో 80,845.75వద్ద స్థిరపడింది.నిఫ్టీ 181 పాయింట్లు లాభంతో 24,457.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌,ఎన్టీపీసీ,యాక్సిస్ బ్యాంక్‌,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఎల్‌ అండ్‌టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్‌,సన్‌ఫార్మా,కోటక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలపై ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72డాలర్ల వద్ద కొనసాగుతోంది.బంగారం ఔన్సు 2,6677 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.