
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. రాణించిన బ్యాంక్,ఆటో స్టాక్స్..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు భారతీయ సూచీలను మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్-జపాన్ మధ్య వ్యాపార ఒప్పందం కుదిరినట్లు ప్రకటించడం ఆసియా మార్కెట్లకు తోడుగా భారత మార్కెట్లకు కూడా బలాన్నిచ్చింది. ఇంకా, ఆగస్టు 1 చివరి తేదీకి ముందు మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదరొచ్చన్న సంకేతాలు పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటో మొబైల్, ఫైనాన్షియల్ స్టాక్స్ పట్ల కొనుగోళ్లు భారీగా సాగాయి. దీనివల్ల మార్కెట్లు బలంగా మద్దతు పొందాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25,200 పాయింట్ల మార్కును దాటి ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 82,451.87 పాయింట్ల వద్ద,గత ముగింపు 82,186.81 పాయింట్లతో పోలిస్తే లాభాలతో ప్రారంభమైంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 68.10 డాలర్లు
దాదాపు పూర్తీ ట్రేడింగ్ సెషన్ నిండా లాభాల్లోనే కొనసాగింది.ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ సూచీ గరిష్ఠంగా 82,786.43 పాయింట్లను తాకింది. చివరికి ఇది 539.83 పాయింట్ల లాభంతో 82,726.64 వద్ద స్థిరమైంది.నిఫ్టీ సూచీ 159 పాయింట్ల లాభంతో 25,219.90 వద్ద ముగిసింది. ఇంతకల్లా డాలరుతో రూపాయి మారకం విలువ 86.43గా ఉంది. సెన్సెక్స్లో చురుకైన 30 కంపెనీలలో టాటా మోటార్స్,భారతీ ఎయిర్టెల్,బజాజ్ ఫైనాన్స్,మారుతీ సుజుకీ,బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. ఇకపోతే, హిందుస్థాన్ యూనిలీవర్, బీఈఎల్,అల్ట్రాటెక్ సిమెంట్,ఐటీసీ, టైటాన్ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్పై దృష్టి పెట్టితే,బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 68.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,437.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.