NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800 
    తదుపరి వార్తా కథనం
    Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800 
    లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800

    Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    04:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో,సూచీలు ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అయితే ట్రేడింగ్‌ సమయంలో కొంతసేపు లాభానష్టాల మధ్య ఊగిసలాడాయి.

    ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో సూచీలు మళ్లీ పుంజుకుని రోజంతా బలంగా నిలిచాయి.

    చివరికి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 320 పాయింట్ల లాభంతో ముగియగా, నిఫ్టీ 24,800 పాయింట్లపై స్థిరపడింది.

    సెన్సెక్స్‌ ఉదయం 81,591.03 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది, గత ముగింపు స్థాయి 81,312.32 పాయింట్లతో పోలిస్తే ఇది స్పష్టమైన లాభమని చెప్పాలి.

    ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్‌ 81,106.98 నుండి 81,816.89 పాయింట్ల మధ్య కదలాడింది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర 65.84 డాలర్లు 

    చివరికి ఇది 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద స్థిరమైంది. అదే సమయంలో నిఫ్టీ అత్యధికంగా 24,892.60 పాయింట్లను తాకింది.

    ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద ముగిసింది.

    మరోవైపు,రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 85.50 వద్ద నిలిచింది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో భాగమైన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,సన్‌ఫార్మా,అదానీ పోర్ట్స్‌,ఎటర్నల్‌,టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా,యాక్సిస్‌ బ్యాంక్‌,కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,టాటా మోటార్స్‌,ఇన్ఫోసిస్‌,ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌,మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    అయితే మరోవైపు,బజాజ్‌ ఫైనాన్స్‌,ఐటీసీ,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌,ఏషియన్ పెయింట్స్‌,టీసీఎస్‌,ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.

    అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల పరంగా చూస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర 65.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,282 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800  స్టాక్ మార్కెట్
    COVID 19: ఆ కోవిడ్ రోగిని 'చంపేయ్‌'..ప్రభుత్వ డాక్టర్‌ ఆడియో క్లిప్‌ వైరల్‌.. FIR నమోదు   మహారాష్ట్ర
    Elon Musk: డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ? డొనాల్డ్ ట్రంప్
    IAF:"ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు": వాయుసేన చీఫ్‌ అసంతృప్తి రాజ్‌నాథ్ సింగ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. బిజినెస్
    Stock Market: నేడు ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock Market: నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్.. 155 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్  బిజినెస్
    Market Crash: యుద్ధ ఆందోళనలతో చతికిలపడ్డ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు వెనక్కి! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025