NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100 
    తదుపరి వార్తా కథనం
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100 
    లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆర్‌ బి ఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన నిర్ణయం మార్కెట్‌కు బలాన్నిచ్చింది.

    ముఖ్యంగా బ్యాంకింగ్,ఫైనాన్షియల్ రంగాల షేర్లు మంచి ప్రదర్శన కనబర్చాయి.

    అలాగే భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో ప్రగతి,అమెరికాలో మెరుగైన ఉద్యోగ గణాంకాలు, అలాగే అమెరికా-చైనా మధ్య జరగబోయే వాణిజ్య చర్చలపై ఆశాజనక అంచనాలు మార్కెట్‌ను ఉత్సాహంగా మార్చాయి.

    ఈ ప్రభావంతో స్టాక్ సూచీలు వరుసగా నాల్గవ రోజు కూడా లాభాల్లోనే ముగియడంతో నిఫ్టీ 25,100 పాయింట్లకు పైగా స్థిరంగా నిలిచింది.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో బీఎస్ఈ సెన్సెక్స్‌ ఉదయం 82,574.55 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది (మునుపటి ముగింపు 82,188.99).

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66 డాలర్లు 

    ఈ సూచీ సర్వదా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 82,669 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌ చివరికి 256.22 పాయింట్లు పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ కూడా 100 పాయింట్ల లాభంతో 25,103.20 వద్ద ముగిసింది.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.63 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌లోని 30ప్రధాన షేర్లలో కోటక్ మహీంద్రా బ్యాంక్,బజాజ్ ఫైనాన్స్,యాక్సిస్ బ్యాంక్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.

    ఇక ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3340 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100  స్టాక్ మార్కెట్
    Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష విశాఖపట్టణం
    RCB: విజయోత్సవం సమయంలో తొక్కిసలాట.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Rapido food delivery: ఫుడ్‌ డెలివరీ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న ర్యాపిడో.. షేక్‌ అవుతున్న స్విగ్గీ, జొమాటో షేర్లు  రాపిడో

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు బిజినెస్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  బిజినెస్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  బిజినెస్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025