
Stock Market: ట్రంప్ శాంతి ప్రకటనతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో దేశీయ మార్కెట్లకు ఉత్సాహాన్ని అందించింది. మంగళవారం నాటి ట్రేడింగ్ భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకుపైగా ఎగబాకగా, నిఫ్టీ 25,200 మార్క్ దాటి ట్రేడ్ అవుతోంది. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 930.7 పాయింట్ల లాభంతో 82,827.49 వద్ద, నిఫ్టీ 278.95 పాయింట్ల లాభంతో 25,250.85 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 68 పైసలు బలపడి 86.10 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్నిరంగాల సూచీలు రాణిస్తున్నాయి.
Details
1శాతానికి పైగా లాభాల్లో ఆటో, బ్యాంకింగ్
ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, లోహం, ఐటీ రంగ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. రియాల్టీ, హెల్త్కేర్ రంగ సూచీలు కూడా పాజిటివ్ ట్రెండ్తో పయనిస్తున్నాయి. ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనతో ముడి చమురు ధరలు కూడా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3.76 శాతం పడిపోయి 68.79 డాలర్ల వద్దకు చేరింది. ఇక ఆసియా-పసిఫిక్ మార్కెట్లూ నేడు రాణిస్తున్నాయి. జపాన్ నిక్కీ 1.59 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.09 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.69 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ 1.38 శాతం మేర పెరిగాయి. ఒక్క చైనా సూచీ మాత్రం ఫ్లాట్గా కొనసాగుతోంది.