NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Trump Tariffs War: అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్దం.. ఎలక్ట్రానిక్స్ విడి భాగాలపై భారత్ కంపెనీలకు రాయితీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Trump Tariffs War: అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్దం.. ఎలక్ట్రానిక్స్ విడి భాగాలపై భారత్ కంపెనీలకు రాయితీ
    అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్దం.. ఎలక్ట్రానిక్స్ విడి భాగాలపై భారత్ కంపెనీలకు రాయితీ

    Trump Tariffs War: అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్దం.. ఎలక్ట్రానిక్స్ విడి భాగాలపై భారత్ కంపెనీలకు రాయితీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2025
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై దాడులు కొనసాగిస్తూ, సుంకాలను వరుసగా పెంచుతున్నారు.

    దీని ప్రభావంగా చైనా కంపెనీలకు అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

    ఈ పరిస్థితిలో, చైనాలోని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థలు భారతీయ కంపెనీలకు తగ్గింపు ధరలపై భాగస్వామ్యం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

    ప్రస్తుతం ఇవి 5 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

    వివరాలు 

    భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారులకు లాభాల వృద్ధి అవకాశాలు

    టీవీలు, ఫ్రిజ్‌లు, స్మార్ట్‌ఫోన్ల తయారీదారుల ప్రకారం, ఈ రాయితీల వల్ల భారత కంపెనీలు తమ లాభాల్లో 2 నుండి 3 శాతం వరకు పెరుగుదల సాధించే అవకాశముంది.

    కంపెనీలు ఈ లాభాన్ని వినియోగదారులకు మళ్లించేందుకు అమ్మకాలను పెంచేందుకు యత్నిస్తున్నాయి.

    వివరాలు 

    చైనాపై అధికంగా ఆధారపడుతున్న భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ

    ప్రస్తుతం భారత కంపెనీలు వినియోగించే ఎలక్ట్రానిక్స్ విడిభాగాల్లో దాదాపు 75 శాతం చైనాలో నుంచే దిగుమతులు వస్తున్నాయి.

    గోద్రెజ్ అప్లయన్స్ విభాగానికి చీఫ్ కమల్ నంది ప్రకారం, చైనా సంస్థలు ఆర్డర్ల లోపంతో ఒత్తిడిలో ఉన్నాయి.

    దీనివల్ల భారతీయ సంస్థలతో ధరలపై చర్చలు జరిపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    ముడి సరుకుల నిల్వలు,కొత్త ఆర్డర్ల తాలూకు గణాంకాలు

    సాధారణంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లేదా మూడు నెలల అవసరాన్ని తీర్చే స్థాయిలో ముడి సరుకులు నిల్వలో ఉంచుతారు.

    మే-జూన్ నెలల నుంచి సంస్థలు తాజా ఆర్డర్లను ఇవ్వడం ప్రారంభిస్తాయి.

    గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ వెల్లడించిన నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కి ఎలక్ట్రానిక్స్ విడిభాగాల దిగుమతులు 36.7 శాతం పెరిగి 34.4 బిలియన్ డాలర్లకు చేరాయి.

    2019లో ఇది 15.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఐదేళ్లలో 118.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

    వివరాలు 

    చైనా కంపెనీల వద్ద మిగులు నిల్వలు.. ధరల తగ్గుదల చర్చలు

    చైనా సంస్థలు ముడి సరుకుల మిగులు సమస్యలను ఎదుర్కొంటున్నాయని టీవీ కాంట్రాక్ట్ తయారీదారు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.

    ఆయన ప్రకారం, అమెరికా ఎగుమతులు నిలిచిపోవడంతో, చైనా సంస్థలు భారత కంపెనీలతో 5 శాతం వరకు ధర తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాయి.

    అయితే దేశీయంగా డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల, ఈ రాయితీల ప్రయోజనాలను వినియోగదారులకు మళ్లించేందుకు కంపెనీలు ధరలు తగ్గించే అవకాశముందని ఆయన అన్నారు.

    2024లో చైనా నుంచి అమెరికాకు దిగుమతుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలే ప్రధానంగా ఉన్నాయని సమాచారం.

    అయితే ఈ విభాగంలో డిమాండ్ తగ్గడం వల్ల చైనా తయారీదారులు నష్టాలు ఎదుర్కొంటున్నారు.

    వివరాలు 

    భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశీయ తయారీకి ఊతం

    దేశీయంగా ప్రభుత్వం నుండి ప్రోత్సాహాలు, నాణ్యత ప్రమాణాలపై కఠిన నిబంధనలు, సుంకాల విధానం తదితర కారణాలతో చైనా పరికరాల డిమాండ్ తగ్గింది.

    ఈ పరిస్థితి స్థానిక తయారీని ప్రోత్సహించడంలో కీలకంగా మారింది.

    ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ ప్రకారం, 2030 నాటికి ఈ రంగం 145-155 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశముందని అంచనా.

    ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే ముఖ్య ఎలక్ట్రానిక్ భాగాలు.. చిప్‌లు, కంప్రెసర్‌లు, ఇన్నర్ గ్రూవ్డ్ కాపర్ ట్యూబ్‌లు, ఓపెన్ సెల్ టీవీ ప్యానెల్‌లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు, బ్యాటరీ సెల్‌లు, డిస్‌ప్లే మాడ్యూల్‌లు, కెమెరా మాడ్యూల్‌లు, ఫ్లెక్సిబుల్ పిసీబీ లాంటి అనేక భాగాలు ఇందులో ఉంటాయి.

    వివరాలు 

    భవిష్యత్ ఆశలు - దిగుమతులపై ప్రభావం

    అమెరికా మార్కెట్‌లో మందగమనం, డిమాండ్ తగ్గడముతో విడిభాగాల ధరలు కూడా తక్కువవుతాయని డైక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ లాల్ అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    వాణిజ్యం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చైనా

    Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఉత్తర భారతంపై ప్రభావం నేపాల్
    Three Gorges Dam Of Space: అంతులేని సౌరశక్తి కోసం.. అంతరిక్షంలో చైనా 'త్రీ గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్'! అంతర్జాతీయం
     HMPV: చైనాలో హెచ్ఎంపీవీ కేసులు తగ్గుదల.. ఇండియాలో 17 నమోదు ప్రపంచం
    TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం!  అమెరికా

    వాణిజ్యం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  అమెరికా
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు  కేంద్ర ప్రభుత్వం
    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025