Page Loader
New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?  
బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?

New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో (Budget Session 2025) ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ చట్టం ప్రస్తుత ఆదాయ పన్ను చట్టాన్ని మరింత సరళంగా,అర్థమయ్యేలా,పేజీల సంఖ్యను దాదాపు 60 శాతం తగ్గించేలా రూపొందించేందుకు ఉద్దేశించబడింది. ప్రస్తుత "ఆదాయ పన్ను చట్టం 1961" కొంత క్లిష్టంగా ఉండి,పేజీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ చట్టాన్ని చదవడం,అర్థం చేసుకోవడం సామాన్యులకు మాత్రమే కాకుండా,టాక్స్‌ నిపుణులకు కూడా కష్టం అవుతోంది. ఆదాయ పన్నునిపుణుల నుంచి వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని,ఆదాయ పన్ను చట్టాన్ని సరళంగా రూపొందించేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

పూర్తి సమాచారం ఏమిటి? 

ఆరు దశాబ్దాల నాటి "ఆదాయ పన్ను చట్టం 1961"పై సమగ్ర సమీక్ష కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జులై బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని పార్లమెంట్‌ బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వ అధికారి ఒకటిగా PTI ద్వారా ప్రకటన వెలువడింది. ఆ ప్రకారం, ప్రభుత్వం తీసుకురానున్న చట్టం, ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ కాకుండా, కొత్త చట్టమే అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ముసాయిదా చట్టం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ (Ministry of Law) పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సెషన్ రెండో సగంలో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.

వివరాలు 

ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్‌

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 04 వరకు జరుగుతాయి. ఈ సెషన్‌లో మొదటి భాగం (జనవరి 31-ఫిబ్రవరి 13) ఉభయ సభల (లోక్‌సభ & రాజ్యసభ) సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించబడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 01న ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత, బడ్జెట్ సెషన్‌ రెండో భాగం మార్చి 10న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 04 వరకు కొనసాగుతుంది.

వివరాలు 

కొత్త పన్ను చట్టం వల్ల ఏమిటి ప్రయోజనం? 

ఆదాయ పన్ను చట్టం 1961 పై సమగ్ర సమీక్ష కోసం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన తరువాత, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT), సమీక్షను పర్యవేక్షించడానికి ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చట్టాన్ని సరళంగా, స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా రూపొందించేందుకు పని చేస్తుంది. కొత్త చట్టం సంక్లిష్ట సమాచారాన్ని సరళంగా మార్చి, పన్ను వివాదాలను, వ్యాజ్యాలను తగ్గిస్తుంది. పన్ను చెల్లింపుదారులకు మరింత ఖచ్చితత్వం అందిస్తుంది. అదేవిధంగా, చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించడానికి 22 ప్రత్యేక సబ్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.