Page Loader
Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం
Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట..

Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కు భారీ ఊరట లభించింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలంటూ ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. రాజ్ కుంద్రా సంస్థ 2017లో బిట్‌కాయిన్ల రూపంలో సుమారు రూ.6,600 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నెల‌కు 10 శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసిన‌ట్లు కేసు ఫైల్ అయ్యింది. ఈ స్కీమ్‌లో మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భ‌ర‌ద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం.

వివరాలు 

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

ఆ బిట్‌కాయిన్లతో ఉక్రెయిన్‌లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ముంబైలోని జుహూలో శిల్పా శెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పుణెలోని ఒక ఫ్లాట్‌, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లు అని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులపై శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే విధించింది.