NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 
    తదుపరి వార్తా కథనం
    Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 
    నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు

    Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ సినీ నటుల్లో తనకు ప్రేరణనిచ్చిన వారిని గుర్తుచేస్తూ, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.

    ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు తనకు స్ఫూర్తిగా నిలిచారంటూ వివరించారు.

    ముంబయిలో నిర్వహించిన 'వేవ్స్‌' (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌) వేదికపై మాట్లాడుతూ,తన సినీ జీవితాన్ని గుర్తుచేసుకున్నారు.

    ''చిన్నప్పటినుంచి నేను డ్యాన్స్‌ చేస్తూ మా కుటుంబ సభ్యులు, స్నేహితులను మెప్పించేవాడిని. అలా నటనపై ఏర్పడిన ఆసక్తి నన్ను చెన్నైకి తీసుకెళ్లింది. నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయానికి చాలా మంది మహానుభావులు అప్పటికే అక్కడ ఉన్నారు. ఇప్పటికే పలువురు సూపర్‌స్టార్స్‌ ఉన్నారు కదా. ఇంకా అదనంగా నేనేం చేయగలను?అని అనుకునేవాడిని.. అయినా, అందరి దృష్టిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాను"అని చిరంజీవి అన్నారు.

    వివరాలు 

     'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌' 

    1977లో నటనలో శిక్షణ తీసుకున్నాను. సహజంగా, మేకప్‌ లేకుండా నటించాలన్న కళను మిథున్‌ చక్రవర్తి నుంచి నేర్చుకున్నాను.

    యాక్షన్‌ సీన్లలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రభావం నాపై ఉంది. అలాగే డ్యాన్స్‌ విషయంలో నా సీనియర్‌ కమల్‌ హాసన్‌ నాకు ఆదర్శంగా నిలిచారు.

    వారి సినిమాలను గమనిస్తూ, వారి నటనను అధ్యయనం చేస్తూ నన్ను నేను అభివృద్ధిపరుచుకున్నాను'' అని వెల్లడించారు.

    భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం 'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌' (వేవ్స్‌).

    గురువారం ప్రారంభమైన ఈ మహాసభ నాలుగు రోజుల పాటు జరగనుంది.

    వేవ్స్‌ సలహా బృందంలో చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

    ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌,మోహన్‌లాల్‌,అక్షయ్‌కుమార్‌,ఆమిర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న చిరంజీవి 

    #WATCH | At #WAVES2025, Legendary Actor Chiranjeevi shared insights on India's cinematic journey, celebrating the power of storytelling in shaping national identity.
    He highlighted the transformative journey of Indian cinema, emphasizing its enduring role in shaping India’s… pic.twitter.com/DeDge9LBJH

    — PB-SHABD (@PBSHABD) May 1, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    చిరంజీవి

    Unstoppable : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్ బాలకృష్ణ
    Vishwambhara First Look: చిరంజీవి బర్తడే.. 'విశ్వంభర' పోస్టర్ వచ్చేసింది విశ్వంభర
    Chiranjeevi : 'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర'సినిమా చేశానన్న మెగాస్టార్ బాలకృష్ణ
    Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025