LOADING...
Nayanthara - Dhanush: నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కోర్టు కీలక తీర్పు
నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కోర్టు కీలక తీర్పు

Nayanthara - Dhanush: నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

'నానుమ్‌ రౌడీ దాన్‌' డాక్యుమెంటరీ వివాదంలో నయనతార, ధనుష్‌ల మధ్య కోర్టు యుద్ధం కొనసాగింది. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌పై ధనుష్‌ దావా వేశారు. 'నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీలో 'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమా విజువల్స్‌ని అనుమతి లేకుండా ఉపయోగించడంపై ఆయన చర్య తీసుకున్నారు. దీనికి ఆయన నిర్మాణ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ దావా విషయంలో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌, వారి కంపెనీ రౌడీ పిక్చర్స్‌పై కూడా న్యాయవాదులు చర్యలు తీసుకున్నారు. కానీ ధనుష్‌ దావాను సవాల్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇటీవల కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.

Details

అసలు ఏం జరిగిందంటే?

'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమా 2015లో విడుదలై, విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార నటించింది. ఈ చిత్రానికి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నయనతార, విఘ్నేశ్‌ ప్రేమలో మునిగారు, అనంతరం 2022లో పెళ్లి చేసుకున్నారు. నయనతారపై రూపొందించిన 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీలో 'నానుమ్‌ రౌడీ దాన్‌' వీడియోలు, పాటలను చూపించాలని ఈ జోడీ భావించింది. కానీ ధనుష్‌ అందుకు అంగీకరించలేదు. డాక్యుమెంటరీలో ఫుటేజ్‌ వాడకం వల్ల ధనుష్‌ లీగల్‌ నోటీసు పంపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది.