
మహేష్ బాబు కో స్టార్ గా హాలీవుడ్ యాక్టర్: విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని తెలిసినప్పటి నుండి ఆ సినిమా గురించి అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.
ప్రపంచంలోని వివిధ ప్రదేశాలను విస్తృతంగా తిరిగే ఇండియానా జోన్స్ మాదిరి కథతో మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పినప్పటి నుండి ఈ సినిమాపై పుకార్లు మరింతగా ఎక్కువయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన రచయిత విజయేంద్ర ప్రసాద్, ఆఫ్రికమ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటించే అవకాశం ఉందని అన్నాడు.
దీంతో ఆ హాలీవుడ్ యాక్టర్ థార్ సినిమా హీరో క్రిస్ హెమ్స్ వర్త్ అయ్యుంటాడని అంటున్నారు.
Details
హాలీవుడ్ ఏజెన్సీలతో రాజమౌళి ఒప్పందాలు
గతంలో హాలీవుడ్ ఏజెన్సీలతో రాజమౌళి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని వార్తలు వచ్చిన సమయంలో క్రిస్ హెమ్స్ వర్త్ పేరు బయటకు వచ్చింది.
రాజమౌళి తర్వాతి సినిమాలో క్రిస్ హెమ్స్ వర్త్ నటించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు స్వయంగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్, హాలీవుడ్ నటీనటులు ఉండే అవకాశం ఉందని చెప్పడంతో క్రిస్ హెమ్స్ వర్త్ ని తీసుకుంటున్నారని అనుకుంటున్నారు.
ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంకా సినిమాను అధికారికంగా ప్రారంభించలేదు కూడా. ప్రస్తుతం మహేష్ అభిమానులు అందరూ ఈ సినిమా ప్రారంభం కోసమే ఎదురుచూస్తున్నారు.