NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
    Cinematic Expo : ఇండియా జాయ్ లో నాగార్జున.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా

    ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 31, 2023
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది.

    దీనికి సినీ రంగంలోని 24 ఫ్రేమ్స్ కి సరికొత్త సాంకేతికతను తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో పేరు పొందింది.

    సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, Vfx, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన ఆధునిక టెక్నాలజీని పరిచయం చేశారు.

    రోజురోజుకూ సాంకేతికంగా చాలా మార్పులు వస్తున్నాయని నాగార్జున అన్నారు. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించామని, నెలకో షూటింగ్ జరిగితే చాలనుకున్నామన్నారు.

    భారతీయ సినిమా పరిశ్రమకు హైదరాబాద్ రాజధానిలా మారనుందని, ఈ మేరకు దక్షిణాది పరిశ్రమలనే ఇండియా ఫాలో అవుతోందన్నారు.

    గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులున్నాయన్నారు.

    details

    వచ్చే సినిమాని ఇక్కడి వాళ్లతోనే తీస్తా : నాగ్ అశ్విన్

    తాను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నానన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్, వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలతో పట్టుకెళ్లానన్నారు.

    హాలీవుడ్‌ వంటి నాణ్యతతో మూవీలు ఎందుకు చేయరని అడుగుతుంటారని, గత 10 ఏళ్లుగా మంచి నాణ్యతతో చిత్రాలు తీస్తున్నామన్నారు.

    ఇప్పుడు హాలీవుడ్ వాళ్లే ఇక్కడకు వచ్చి సినిమాలు చేస్తున్నారని, వచ్చే సినిమాని ఇక్కడి వాళ్లతోనే హాలీవుడ్ కంటే అత్యుత్తమ క్వాలిటీతో తీస్తాన్నారు.

    కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు యానిమేషన్, గేమింగ్ ఆశించిన మేర అభివృద్ది కాలేదని, ఇప్పుడు ఆ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చామని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు.

    కొత్త విధానాలతో 2016లో తీసుకొచ్చిన పాలసీ ఈ మేరకు దోహదపడిందన్నారు. దేశంలో ఎన్ని పాలసీలున్నా, స్థానికంగా పాలసీలను ఆచరణలోకి తీసుకొచ్చామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    టాలీవుడ్

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    హైదరాబాద్

    గవర్నర్‌ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్  గవర్నర్
    అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ తెలంగాణ
    గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన గద్దర్
    గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా! గద్దర్

    టాలీవుడ్

    Mega 157: చిరంజీవి కొత్త సినిమా నుంచి మెగా కబురు.. ఇక అడ్వెంచరే చిరంజీవి
    చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించలేదు..చిరంజీవి, ప్రభాస్ ట్వీట్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు
    Siima Awards 2023: సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ సైమా అవార్డ్స్ 2023
    నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు  నవీన్ పొలిశెట్టి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025