
Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ వివాహ వేడుకకు గడువు సమీపిస్తోంది. జూన్ 6న అఖిల్ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలో అఖిల్ వివాహానికి సంబంధించి నాగార్జున ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు.
ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన చిన్న కుమారుడి వివాహానికి రావాలని కోరిన నాగార్జున, తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసిన నాగార్జున, అఖిల్ పెళ్లి పత్రికను చంద్రబాబుకు అందజేస్తూ ఆహ్వానం తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా నాగార్జున ప్రత్యేకంగా ఆహ్వానం తెలపనున్నట్లు సమాచారం.
Details
గతేడాది అఖిల్, జైనబ్ రవ్జీ నిశ్చితార్థం
గతేడాది నవంబర్లో అఖిల్, జైనబ్ రవ్జీ నిశ్చితార్థం జరగగా, ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అప్పటి నుంచి వీరి పెళ్లిపై సినీ వర్గాలు, అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పెళ్లి జూన్ 6న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది.
గతేడాది నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం కూడా ఇదే స్టూడియోలో జరిగిన విషయం తెలిసిందే.
జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. అఖిల్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
త్వరలో 'లెనిన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలున్నాయి.