
Samantha: రాజ్'తో మరోసారి కనిపించిన సమంత.. దుబాయ్ ఫ్యాషన్ వీక్లో ఇద్దరు ప్రత్యక్షం
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం చుట్టూ వస్తున్న వార్తలపై మరోసారి చర్చలకు దారితీస్తోంది. కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ మధ్య సమంత చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. వివరాల ప్రకారం,సమంత ఇటీవల దుబాయ్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్కు రాజ్ నిడిమోరుతో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన చేతిలో చేయి వేసి నడుస్తున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఫోటోలో రాజ్ ముఖం పూర్తిగా స్పష్టంగా కనబడకపోయినప్పటికీ,నెటిజన్లు,అభిమానులు ఆయననే అని భావిస్తున్నారు. అంతేకాక,ఎయిర్పోర్టులో ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తుండడం గమనార్హం.ఈ కొత్త పోస్ట్ తర్వాత వీరి బంధంపై చర్చలు నెట్టింట మళ్లీ మొదలయ్యాయి.
వివరాలు
సమంత,రాజ్ మధ్య ఏదో ఉన్నట్టుగా వార్తలు
గత కొంతకాలంగా సమంత,రాజ్ మధ్య ఏదో ఉన్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్ళటం, ఒకే ఇంట్లో ఉంటున్నారనే ప్రచారం కూడా గతంలో వెలువడ్డాయి. పలు సందర్భాల్లో సమంత రాజ్తో ఉన్న ఫోటోలను పంచుకోవడం ఈ వార్తలకు మరింత ఊతాన్ని ఇచ్చింది. అయితే, రాజ్కు ఇదివరకే వివాహం కావడం ఈ విషయంలో హాట్ టాపిక్గా మారింది. ఆయన భార్య కూడా ఈ సంబంధంపై పరోక్షంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
వివరాలు
తమ బంధంపై పరోక్షంగా హింట్ ఇచ్చిందంటూ చర్చ
నాగ చైతన్యతో విడాకులు ఆ తర్వాత,మయోసైటిస్ కారణంగా సమంత సినిమాల నుంచి కొంత కాలం దూరంగా ఉండడం వల్ల, ఆమె ఇప్పుడు తన ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ సమయంలో రాజ్ నిడిమోరుతో సమంత సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రూమర్లపై సమంత ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, ఆమె తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ బంధాన్ని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.