
Samantha : లంచ్కు కూర్చుంటే.. లేచేసరికే ఈవెనింగ్.. సమంత హాస్య కామెంట్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటోంది. తన స్టైలిష్ ఫొటోలు, రిలేటబుల్ రీల్స్, విభిన్న పోస్ట్లతో ఫ్యాన్స్ను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఫుల్ అప్స్ చేయకపోతే కామెంట్స్ చేయొద్దు అనే సెటైరికల్ పోస్ట్తో ట్రెండ్లోకి వచ్చిన సమంత, ఇప్పుడు మరోసారి తన డైలీ లైఫ్పై సరదా వ్యాఖ్యతో వార్తల్లోకెక్కింది.
Details
కీర్తి సురేష్తో జట్టు.. వైరల్ అవుతోన్న ఫోటో
'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సమంత.. "లంచ్కి మధ్యాహ్నం కూర్చుంటే, లేచేసరికే సాయంత్రం అయిపోతుందంటూ హ్యూమర్తో కూడిన క్యాప్షన్ జత చేసింది. ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ "టూ క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్" అంటూ కామెంట్లతో తెగ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీలో చాలామంది పరిచయాలున్నా, సమంతకు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం చాలా తక్కువమంది. ఆ కొద్దిమందిలో కీర్తి సురేష్ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. 'మహానటి' సినిమాతో ప్రారంభమైన వీరి స్నేహం, అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతోంది. బీచ్ వాక్స్, హాలీడే ట్రిప్స్, పార్టీలు ఇలా ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపిస్తూ అభిమానులకు ఫ్రెండ్షిప్ గోల్స్ ఇస్తున్నారు.
Details
కెరీర్ బిజీగా ఉన్నా.. స్నేహానికి సమయం
ప్రస్తుతం సమంత, కీర్తి ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ స్నేహాన్ని కాపాడుకుంటున్నారు. ఒకరిపై మరొకరు చూపుతున్న పరస్పర గౌరవం, ఆప్యాయత ఈ ఫోటో ద్వారా మరోసారి రుజువైంది.