Page Loader
Viswam: దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?
దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?

Viswam: దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 29, 2024
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కొంత విఫలం అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి, అందుకే 'విశ్వం' చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్‌ల నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

Details

నవంబర్ 1న రిలీజ్ అయ్యే ఛాన్స్

దసరా సందర్భంగా అక్టోబర్ 11న 'విశ్వం' విడుదలైంది. కామెడీతో హిట్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. త్వరలోనే ఓటీటీలో విడుదల చేస్తే కొంతైనా నష్టాలను తగ్గించుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో, దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావాలని సమాచారం ఉంది.