Page Loader
Narendra Modi:'1.4 బిలియన్ల భారతీయులు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు' : సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ
సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ

Narendra Modi:'1.4 బిలియన్ల భారతీయులు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు' : సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ మూలాలకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు, వీరిద్దరూ భూమికి తిరిగి రానున్నారు. బుధవారం తెల్లవారుజామున వారు భూమి మీదకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ సునీత విలియమ్స్‌కు లేఖ రాశారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ లేఖను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. మోదీ తన లేఖలో, మొత్తం ప్రపంచం సునీత విలియమ్స్ భద్రంగా భూమికి చేరాలని ఎదురుచూస్తోందని తెలిపారు. ఆమె వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మన హృదయాలకు చాలా దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు 

సునీత ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు

సునీత ఆరోగ్యంగా ఉండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారని మోదీ తెలిపారు. తన అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ లేదా బైడెన్‌ను కలిసినప్పుడు కూడా ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఆమె సాధించిన విజయంపై గర్వపడుతున్నారని తెలిపారు. సునీత భర్త మైఖేల్ విలియమ్స్‌తో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్‌కూ మోదీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జితేంద్ర సింగ్ చేసిన ట్వీట్