NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి!
    ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి!

    Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 19 మంది మావోయిస్టుల మృతి!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించారు.

    నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో మొదట నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, తరువాతి సమయంలో ఈ సంఖ్య 12కి పెరిగింది.

    ఈ రోజు ఉదయానికి మొత్తం 19 మంది మావోయిస్టులు చనిపోయినట్లు నిర్ధారించారు.

    తెలంగాణ సరిహద్దులో ఉన్న బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతాలలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

    ఈ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఎస్ఎల్ఆర్, బీజీసీ వంటి ఆయుధాలతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    వివరాలు 

    ఆపరేషన్‌లో వెయ్యి మంది కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు

    ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు బీజాపూర్, సుకుమా, దంతేవాడ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు తరలివచ్చినట్లు సమాచారం.

    మావోయిస్టులు సమావేశం అవుతున్నట్టు సమాచారంతో భద్రతా బలగాలు అక్కడకు వెళ్లి ఎన్‌కౌంటర్‌ను ప్రారంభించారు.

    సమావేశం అనంతరం అడవిలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్న మావోయిస్టులపై భద్రతా బలగాలు వెంటాడి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

    భద్రతా బలగాలు మావోయిస్టులను ఎవరినీ విడిచిపెట్టకుండా క్రమంగా ఆపరేషన్‌ను కొనసాగించారు.

    వివరాలు 

    2024లో మొత్తం 270 మందికి పైగా మావోయిస్టులు మృతి 

    జనవరి నెలలో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మరణించారు.

    ఇదిలా ఉండగా, భద్రతా బలగాలు 9 మంది మందు పాతర పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.

    2024లో మొత్తం 270 మందికి పైగా మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందారు.

    ఈ నెల 6న బీజాపూర్ జిల్లాలోని కుట్టు వద్ద జరిగిన మందు పాతర పేలుడులో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ నేపథ్యంలో బీజాపూర్‌లో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా దృష్టి పెట్టింది. దీంతో ఈ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    ఛత్తీస్‌గఢ్‌

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    ఛత్తీస్‌గఢ్

    Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే కాంగ్రెస్
    Mahadev app case: బీజేపీ నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది: భూపేష్ బఘేల్ భూపేష్ బఘేల్
    Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు  ఛత్తీస్‌గఢ్‌
    Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‌,మిజోరంలలో పోలింగ్ ప్రారంభం  అసెంబ్లీ ఎన్నికలు

    ఛత్తీస్‌గఢ్‌

    Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట  ఛత్తీస్‌గఢ్
    Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా? ఇండియా
    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025