NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం
    పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం

    Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పాకిస్థాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

    మృతుల్లో ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా కూడా ఉండగా, పలువురు గాయపడ్డారు.

    ఈ దాడులకు ప్రతిస్పందనగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

    మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

    పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు కౌంటర్‌గా పాక్ దాడులు మళ్లీ చెలరేగాయి.

    Details

    శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ పేలుడు

    నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టి వరుసగా దాడులు చేస్తోంది.

    శ్రీనగర్, రాజౌరి, పూంఛ్, పఠాన్ కోట్ వంటి ప్రాంతాల్లో పాక్ డ్రోన్‌లు బాంబులు వేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కూడా పాక్ సైన్యం దాడులకు పాల్పడింది.

    బాంబు పేలుళ్ల నేపథ్యంలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ అమలు చేశారు.

    ఉదయం పఠాన్ కోట్, శ్రీనగర్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.

    మధ్యాహ్నం 11 గంటల సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ పేలుడు శబ్దం విన్నట్లు అధికారులు వెల్లడించారు.

    Details

    భద్రతా ఏర్పాట్లు ముమ్మరం

    భారత్ సైన్యం పాక్ దాడులకు సమర్థవంతంగా కౌంటర్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

    సైనికులు సైరన్లు మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.

    ఈ మేరకు ప్రతి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు సమాచారం.

    ఇలాంటి ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. పౌరుల ప్రాణాలు కోల్పోవడం, ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా మారడం తీవ్ర విషాదానికి దారితీసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    జమ్ముకశ్మీర్

    Pahalgam: పహల్గాం దాడిపై ఇంటెలిజెన్స్‌ ముందస్తు హెచ్చరికలున్నా.. చర్యలలో విఫలమయ్యారా?  భారతదేశం
    Terror Attack: రూ.10 లక్షల పరిహారం.. బ్లాక్‌ కలర్‌లో కశ్మీర్ పత్రికల ఫ్రంట్‌ పేజ్‌ భారతదేశం
    Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..! భారతదేశం
    Abir Gulal: పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. బాలీవుడ్‌లో ఆ మూవీ బ్యాన్! బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025