NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..
    తదుపరి వార్తా కథనం
    YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..
    ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..

    YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్.. జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ఒంగోలులో వైసీపీకి మరో పెద్ద షాక్‌ ఎదురుకానుంది.

    వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేనలో చేరారు.

    ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు,కో-ఆప్షన్‌ సభ్యులు జనసేనలో చేరనున్నారు.

    మొత్తం 20 మంది వైసీపీ కార్పొరేటర్లు,ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

    గత కొంతకాలంగా ఈ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతూనే ఉన్నప్పటికీ,పవన్‌ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడిందని సమాచారం.

    వివరాలు 

    జనసేన వైపు అడుగులు

    గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నేతగా ఉన్న సమయంలో ఆయన మద్దతుతోనే అనేక మంది కార్పొరేటర్లు విజయం సాధించారు.

    కానీ,ఇప్పుడు ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన నేపథ్యంలో, ఆయన అనుచరులంతా జనసేన వైపు అడుగులు వేస్తున్నారు.

    ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్‌ టీడీపీ ఆధీనంలోకి వెళ్లిపోయింది.ఇప్పుడు మరో 23 మంది సభ్యులు జనసేనలో చేరితే, ఒంగోలు కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఈ మార్పును అడ్డుకోవడానికి టీడీపీ కూడా ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    మొత్తంగా, వైసీపీకి షాక్‌ ఇస్తూ,ఈ రోజు ఒంగోలు కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు ఒంగోలు కార్పొరేటర్లు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జనసేన
    వైసీపీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జనసేన

    జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్  చంద్రబాబు నాయుడు
    Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  పవన్ కళ్యాణ్
    Pawan Kalyan: రాజోలు, రాజానగరం నుండి జనసేన పోటీ  భారతదేశం
    Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన  పవన్ కళ్యాణ్

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025