NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాల సమక్షంలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శుక్రవారం రోజున మొత్తం 22మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు.

    వారిలో 12మందిపై రూ.40 లక్షల వరకు రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    మావోయిస్టుల అమానవీయ సిద్ధాంతాలు, వారు స్థానిక గిరిజనులపై చేసిన అకృత్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, తొమ్మిది మంది మహిళలు సహా 13 మంది మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారుల సమక్షంలో లొంగిపోయినట్టు సుక్మా జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ వెల్లడించారు.

    వీరంతా అనేక హింసాత్మక, విధ్వంసక చర్యల్లో పాల్గొన్నవారని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    గతేడాది 792మంది మావోయిస్టులు లొంగుబాటు 

    లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, అతని భార్య, స్క్వాడ్ సభ్యురాలు ముచాకి జోగి ఉన్నారు.

    ఈ జంటపై ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. అలాగే, ఏరియా కమిటీకి చెందిన దేవే, దుధి బుధ్రాలపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నదని పోలీసులు తెలిపారు.

    మరో ఏడుగురు మావోయిస్టులపై రూ.2 లక్షల చొప్పున రివార్డు ఉండగా, ఇంకొకరిపై రూ.50,000 రివార్డు ఉంది.

    లోగిపోయిన ప్రతి ఒక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించామని, వారిపై ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలను వర్తింపజేస్తామని అధికారులు చెప్పారు.

    గతేడాది బస్తర్ ప్రాంతంతో పాటు సుక్మా జిల్లాలో మొత్తం 792మంది మావోయిస్టులు లొంగుబాటు చేసినట్లు తెలిపారు.

    వివరాలు 

    70శాతానికి పైగా తగ్గిపోయిన  మావోయిస్టులు 

    ఇటీవలి రోజుల్లో మావోయిస్టుల లొంగుబాటుకు ప్రాముఖ్యత పెరగడం వెనుక,కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన కూడా ఒక కారణమని పేర్కొనవచ్చు.

    ఆయన గురువారం స్పష్టం చేసిన ప్రకారం,వచ్చేఏడాది మార్చి 31లోపు దేశం మొత్తంలో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే లక్ష్యమని చెప్పారు.

    మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సీఆర్పీఎఫ్ 86వ స్థాపన దినోత్సవ పరేడ్‌లో మాట్లాడిన అమిత్‌ షా, మావోయిస్టుల నుంచి విముక్తమైన భారతదేశాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

    ఈ మిషన్‌లో సీఆర్పీఎఫ్ కీలకంగా పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు.

    ఫలితంగా మావోయిస్టుల హింసాత్మక చర్యలు 70శాతానికి పైగా తగ్గిపోయాయని,ఇప్పుడు ఆసమస్య ముగింపు దశకు చేరుకుంటోందని వెల్లడించారు.

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక కోబ్రా దళాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    ఛత్తీస్‌గఢ్‌

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    ఛత్తీస్‌గఢ్

    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి  ఛత్తీస్‌గఢ్‌
    Chhattisgarh: బీజాపూర్లో ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టులు మృతి  ఛత్తీస్‌గఢ్‌
    Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం ఛత్తీస్‌గఢ్‌

    ఛత్తీస్‌గఢ్‌

    Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు ఛత్తీస్‌గఢ్
    Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి  ఛత్తీస్‌గఢ్
    Encounter in Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం ఎన్‌కౌంటర్
    Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని.. 8 మంది దుర్మరణం  ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025