NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!
    225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!

    Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 12, 2025
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది.

    ఈ నూతనోత్సాహంతో బీహార్‌లోనూ అదే జోరు కొనసాగించాలని కమలనాథులు సంకల్పించారు.

    అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది.

    సాధారణంగా దీర్ఘకాలం అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది.

    అయితే దిల్లీలో పదేళ్ల పాలన అనంతరం బీజేపీ వ్యతిరేకతను తమ అనుకూలంగా మార్చుకుని విజయం సాధించిందని, అదే తరహాలో బీహార్‌లోనూ వ్యూహాలు రచించాలని భావిస్తోంది.

    Details

    తేజస్వీ యాదవ్‌కు అవకాశం ఇచ్చేది లేదు 

    బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఎలాగైనా 225 సీట్లు గెలిచి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

    నితీష్ కుమార్‌తో కలిసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహాలను రూపొందిస్తోంది.

    ఇదే సమయంలో ఆర్జేడీ ప్రభుత్వం వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

    అయితే ఆ అవకాశాన్ని తేజస్వీ యాదవ్‌కు ఇవ్వకుండా ముందుగా తాము వ్యతిరేకతను తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది.

    సీట్ల పంపకాలపై వ్యూహం

    సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి అంతరాయం రాకుండా జేడీయూతో వ్యూహాత్మకంగా చర్చలు జరపాలని బీజేపీ భావిస్తోంది.

    అయితే జేడీయూ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయనుందని అంచనా. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

    Details

    74 సీట్లను గెలుచుకున్న బీజేపీ

    2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేసి కేవలం 43 సీట్లను మాత్రమే గెలుచుకుంది.

    బీజేపీ పోటీ చేసిన 110 స్థానాల్లో 74 సీట్లను కైవసం చేసుకుంది.

    అయితే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగడం గమనార్హం. మధ్యలో ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, కొద్ది రోజుల్లోనే తిరిగి బీజేపీతో చేతులు కలిపారు.

    2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీయూ కూటమి అధిక పార్లమెంట్‌ సీట్లు గెలుచుకుంది.

    ఇప్పుడీ ఎన్నికల్లోనూ అదే విజయాన్ని సాధించి తిరిగి బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    బిహార్
    నితీష్ కుమార్

    తాజా

    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    బీజేపీ

    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన నరేంద్ర మోదీ
    Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు  దిల్లీ
    Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు అల్లు అర్జున్
    DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం అమిత్ షా

    బిహార్

    Patna: చిన్నారిని గొంతు నులిమి హత్య.. బహిర్గతమైన పోస్ట్ మార్టమ్ నివేదిక  పాట్న
    PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం  నరేంద్ర మోదీ
    PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Bihar: బీహార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని రద్దు చేసిన పాట్నాహైకోర్టు  పాట్న

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025