NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
    మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు

    AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2027 నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

    ఈ లక్ష్యానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులు కోరారు. రాష్ట్రంలో జలజీవన్‌ మిషన్‌ పథకం అమలుపై గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష జరిగింది.

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.

    కేంద్రం కేటాయించిన రూ.27,248 కోట్లలో కేవలం రూ.4,235 కోట్లే ఖర్చు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం నుండి నిధులు అందించని కారణంగా పనులు ముందుకు సాగలేదని ఆయన అన్నారు.

    వివరాలు 

    తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు

    2019కి ముందు పలు గ్రామాలలో కుళాయిలు ఏర్పాటు చేసి, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందించామని.. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు' అని చంద్రబాబు మండిపడ్డారు.

    ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని బాగా వినియోగిస్తున్నాయనే ముఖ్యమంత్రి తెలిపారు.

    అయితే, మన రాష్ట్రంలో 28 లక్షల ఇళ్లకు ఇంకా కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

    "గ్రామాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలి" అని చంద్రబాబు అన్నారు.

    సమీప రిజర్వాయర్ల నుండి పైపులైన్లు వేసి గ్రామాలకు నిరంతరంగా తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

    నీటి లభ్యత, వినియోగంపై జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం చేయాలని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు

    28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలన్నారు. అత్యున్నతస్థాయి కన్సల్టెంట్లను భాగస్వాములుగా చేర్చాలని ఆయన సూచించారు.

    సురక్షిత నీటితో పాటు వేగంగా సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు.

    గత ప్రభుత్వ తప్పిదాల వల్ల జలజీవన్‌ మిషన్‌ అమలులో జాప్యం జరిగిందని, వాటిని సరిదిద్ది నిధులు అందించడానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన అన్నారు.

    పురోగతి లేని పనుల టెండర్లు రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

    నిర్మాణంలో ఉన్న పనులను గుత్తేదారులతో పూర్తి చేయించి, మెటీరియల్ వినియోగంపై ఇంజినీర్లు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు.

    మూడు నెలల్లో పనులు ముందుకు సాగాలని ఆయన చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు
    పవన్ కళ్యాణ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్ భారతదేశం
    High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..   భారతదేశం
    Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే చంద్రబాబు నాయుడు
    Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్  భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు భారతదేశం
    Chandrababu: ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఏపీ సీఎం చంద్రబాబు   భారతదేశం
    Anna Canteen: గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు భారతదేశం
    CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా  భారతదేశం

    పవన్ కళ్యాణ్

    OG: పుకార్లకు ముగింపు పలికిన OG నిర్మాతలు సినిమా
    Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్  చంద్రబాబు నాయుడు
    Pawan kalyan:OG కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025