NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'one nation, one election': 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 ​​మంది ఎంపీలు ఓటు 
    తదుపరి వార్తా కథనం
    'one nation, one election': 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 ​​మంది ఎంపీలు ఓటు 
    'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 ​​మంది ఎంపీలు ఓటు

    'one nation, one election': 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'కు అనుకూలంగా 269 ​​మంది ఎంపీలు ఓటు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 17, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' ప్రణాళికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ముందు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టింది.

    ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

    ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ వంటి రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించగా, ఎన్డీయే మిత్రపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.

    అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా, 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా 198 మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.

    వివరాలు 

    ప్రతిపక్ష నేతలు ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు 

    ఈ సందర్భంగా టీడీపీ భేషరతుగా బిల్లుకు మద్దతు ప్రకటించింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గి సామర్థ్యం పెరిగి, అభివృద్ధికి ఆటంకం తొలగుతుందని తెలిపారు.

    పోలింగ్ శాతం మెరుగుపడటంతో పాటు, తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏర్పడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.

    ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు చేశారు.

    కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ దీన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పేర్కొనగా, ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ జమిలి ఎన్నికల వల్ల నియంతృత్వానికి తలుపులు తెరుచుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    వివరాలు 

    జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి: అసదుద్దీన్ ఓవైసీ

    టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ రాష్ట్రాల హక్కులు దెబ్బతినడంతో పాటు ఇది ప్రజాస్వామ్యానికి వైరస్‌గా మారుతుందని విమర్శించారు.

    మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే ఉద్దేశంతో, జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయని చెప్పారు.

    మరోవైపు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశారు.

    కేంద్రానికి అనుకూలంగా ఉన్న శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రతిపక్షాలు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉంటాయని విమర్శించారు.

    వివరాలు 

    బిల్లును జేపీసీకి పంపడంపై అభ్యంతరం లేదు: అమిత్ షా  

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బిల్లును జేపీసీకి పంపడంపై అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

    బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ మాట్లాడుతూ, ఇది కొత్త విషయం కాదని, 1983 నుంచే ఈ విధానానికి డిమాండ్ ఉందని తెలిపారు.

    స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లో ఇదే విధమైన ఎన్నికలు జరిగాయని, జమిలి ఎన్నికల వల్ల రాజ్యాంగానికి భంగం కలగదని, ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025