NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు
    సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు

    CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    08:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసే వ్యవధిని తగ్గించేందుకు, పోలీసులు 'వీఐపీ మూవ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌'అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని పరీక్షిస్తున్నారు.

    సీఎం చంద్రబాబు వాహన శ్రేణికి ప్రత్యేకంగా ట్రాఫిక్‌ను ఆపవద్దని ఆదేశించడంతో,ఉన్నత పోలీసు అధికారులు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

    36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు

    గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి,ప్రకాశం బ్యారేజీ గుండా విజయవాడ నగరం మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ ఉన్న ప్రధాన రూట్‌ పై రెండు వైపులా మొత్తం 36 ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు.

    ఇవన్నీ కృత్రిమ మేధ(AI)ఆధారంగా పనిచేస్తాయి.ఈకెమెరాలను విజయవాడ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కి అనుసంధానం చేశారు,తద్వారా ప్రత్యక్షంగా ట్రాఫిక్‌పై నిఘా పెట్టడం సాధ్యమవుతోంది.

    వివరాలు 

    ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఆధారంగా.. 

    కొండవీటి వాగు వద్ద ఏర్పాటు చేసిన తొలి కెమెరా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌(IoT)సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది.

    సీఎం వాహన శ్రేణికి ముందు ఉండే ముందస్తు వాహనం అక్కడికి చేరగానే,ఈ కెమెరా జీపీఎస్ ద్వారా గుర్తించి,దృశ్యాలను వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపుతుంది.

    ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని,తర్వాతి మూడు కీలక ప్రాంతాల వద్ద ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తారు.

    అంతేకాకుండా, ప్రతి ట్రాఫిక్ పాయింట్ వద్ద ఎంతసేపు ట్రాఫిక్ నిలిపివేయబడిందో ఈకెమెరాలు స్వయంచాలకంగా లెక్కించి, ఆ డేటాను సర్వర్‌కు పంపించే విధంగా డిజైన్ చేశారు.

    గన్నవరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటివచ్చే కూడలి అయిన కేసరపల్లి జంక్షన్ వద్ద కూడా ఇదే విధమైన IoT ఆధారిత కెమెరా అమర్చారు.

    వివరాలు 

    గరిష్ఠంగా 5 నిమిషాలే..! 

    గత రెండు నెలలుగా పోలీసులు ఈ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కృత్రిమ మేధా ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశారు.

    తొలుత సీఎం ప్రయాణించే మార్గాల్లో సగటున 10 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేస్తుండేవారు.

    అయితే, ఈ కొత్త వ్యవస్థను ప్రయోగంలోకి తీసుకువచ్చిన తర్వాత, ఆ వ్యవధి గరిష్ఠంగా 5 నిమిషాలకు తగ్గింది.

    భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఫీల్డ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత, ఈ సాంకేతిక విధానాన్ని అధికారికంగా అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చంద్రబాబు నాయుడు
    Los Angeles:లాస్‌ ఏంజెలెస్‌లో మరో 2,000 మంది నేషనల్ గార్డ్స్ మోహరింపు  అమెరికా
    Viral video:నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి.. భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం అమెరికా
    Nicholas Pooran:వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్‌ నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు వెస్టిండీస్

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: టీడీపీని అంతమొందిస్తామని చెప్పినవారే కాలగర్భంలో కలిశారు : చంద్రబాబు భారతదేశం
    Chandrababu: ఆర్థిక అసమానతుల నిర్మూలన కోసం పీ-4 విధానం : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి సీఎం చంద్రబాబు ఫోకస్.. మూడు పార్టీల్లో కీలకంగా ఉన్న వారికి పదవులు.. భారతదేశం
    CM Chandrababu: విజయవాడ బైపాస్‌ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌.. జూన్‌ ఆఖరుకు రాకపోకలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025