Page Loader
Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..? 
ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..?

Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలు నెల రోజుల్లో పూర్తి..! ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతిగా ఉన్నజగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడంతో,ఆ స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా నేపథ్యంలో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందన్న సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం,ఎన్నికల ప్రక్రియను భారత కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి 24గంటల్లో ప్రారంభించే అవకాశముంది. ఇదిలా ఉండగా,పార్లమెంట్ వర్గాల ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియను నెల రోజుల్లో పూర్తిచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే,ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఖాళీగా ఉన్న ఉప రాష్ట్రపతి పదవిని తొందరగా భర్తీ చేయాలనే దిశగా ప్రభుత్వ వర్గాలు చర్యలు చేపడుతున్నాయని సమాచారం.

వివరాలు 

ఆరోగ్య సమస్యల కారణంగా జగ్‌దీప్ ధన్‌ఖడ్  రాజీనామా 

కానీ రాజ్యాంగంలో మాత్రం ఉప రాష్ట్రపతి ఎన్నికల గడువు గురించి స్పష్టమైన సమయ పరిమితి ప్రస్తావించలేదు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన అనంతరం, ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో ప్రభుత్వ బంగ్లాను ఆయనకు కేటాయించే అవకాశముందని తెలిసింది. అదే సమయంలో,కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు భద్రత కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదించారు.

వివరాలు 

ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..? 

పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.అంటే లోక్‌సభ, రాజ్యసభ సభ్యులే ఓటు వేస్తారు. ప్రస్తుతం ఈ రెండు సభల్లో ఎన్డీయే(జాతీయ ప్రజా గణతంత్ర కూటమి)కి స్పష్టమైన మెజారిటీ ఉన్న కారణంగా,ఉప రాష్ట్రపతి ఎంపికపై వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది సభ్యులు ఉన్నారు.అయితే పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో 240 మంది సభ్యులు ఉన్నారు,వీటిలో ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే నామినేటెడ్ సభ్యులు నలుగురు ఉన్నారు.మొత్తం ఉభయ సభల కలిపిన సభ్యుల సంఖ్య 786. వీరిలో మెజారిటీగా భావించే 394 మంది మద్దతుతో విజయం సాధించవచ్చు.

వివరాలు 

ఎన్డీయేకి అనుకూలంగా 422 మంది ఎంపీలు 

ప్రస్తుతానికి ఎన్డీయేకు లోక్‌సభలో 293 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యసభలో వారికి 129 మంది మద్దతు ఉన్నారు. మొత్తంగా 422 మంది ఎంపీలు ఎన్డీయేకి అనుకూలంగా ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం ఉప రాష్ట్రపతి పదవిని ఎన్డీయేకి చెందిన వ్యక్తి దక్కే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనవారు మిగిలిన కాలానికి కాకుండా ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు.