NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
    పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

    India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    గురువారం ఉదయం పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండి, సియాల్‌కోట్ సహా పదకొండు నగరాలపై డ్రోన్ల ద్వారా దాడులు జరిగినట్లు సమాచారం.

    ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యం పాక్ గగనతల రక్షణ వ్యవస్థలేనని తెలుస్తోంది.

    దాంతో, ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా స్థంభించినట్లు తెలుస్తోంది.

    భారత్‌పై పాక్ దాడులకు సిద్ధమవుతోందనే అనుమానంతోనే ఈ చర్యకు భారత్ పాల్పడినట్లు విశ్వసిస్తున్నారు.

    వివరాలు 

    HQ-9 వ్యవస్థను చైనా,రష్యా రూపొందించిన S-300 నమూనా

    చైనా రూపొందించిన HQ-9 క్షిపణి వ్యతిరేక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.

    ముఖ్యంగా లాహోర్‌లో పాక్ సైనిక విభాగానికి ఎలాంటి గగనతల రక్షణ లేకుండా పోయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

    HQ-9 వ్యవస్థను చైనా, రష్యా రూపొందించిన S-300 నమూనాను అనుసరించి అభివృద్ధి చేసింది.

    ప్రస్తుతం పాకిస్తాన్ లో వినియోగంలో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థ ఇదే. గమనించదగిన విషయం ఏంటంటే, గతంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ప్రయోగించిన క్షిపణులను HQ-9 వ్యవస్థ గుర్తించలేకపోయింది.

    వివరాలు 

    డ్రోన్ దాడులు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంగా జరిగాయి 

    లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయానికి సమీపంగా గురువారం ఉదయం తీవ్రమైన పేలుళ్లు సంభవించాయి.

    దీని నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్లను విడిచి పరుగులు పెట్టారు. ఆ ప్రాంతంలో సైరన్లు మోగినట్లు స్థానిక వార్తా వర్గాలు తెలిపాయి.

    డ్రోన్ దాడులు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంగా జరిగాయని పాకిస్తాన్ వెల్లడించింది.

    ఫలితంగా, ఆ ప్రాంతంలో ఆర్మీ విభాగాలు, ఆర్థిక కేంద్రాలలో గందరగోళం నెలకొంది.

    ఈ పరిస్థితుల దృష్ట్యా లాహోర్, కరాచీ, సియాల్‌కోట్ విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లాహోర్‌లో ఈ ఉదయం డ్రోన్ అటాక్స్.. 

    Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf

    — Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    పాకిస్థాన్

    Pahalgam Terror attack: భారత వైమానిక దాడుల భయం.. సియాల్‌కోట్‌ ప్రాంతానికి  రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్న పాక్‌! అంతర్జాతీయం
    X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌ భారతదేశం
    India-Pakistan:మరో 24-36 గంటల్లో భారత్‌ సైనిక చర్యకు ప్రణాళిక.. పాక్‌ మంత్రి కీలక వ్యాఖ్యలు  అంతర్జాతీయం
    Indo-Pakistan War: ఇండియా- పాకిస్థాన్ యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025