Page Loader
India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్, రావల్పిండి, సియాల్‌కోట్ సహా పదకొండు నగరాలపై డ్రోన్ల ద్వారా దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యం పాక్ గగనతల రక్షణ వ్యవస్థలేనని తెలుస్తోంది. దాంతో, ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా స్థంభించినట్లు తెలుస్తోంది. భారత్‌పై పాక్ దాడులకు సిద్ధమవుతోందనే అనుమానంతోనే ఈ చర్యకు భారత్ పాల్పడినట్లు విశ్వసిస్తున్నారు.

వివరాలు 

HQ-9 వ్యవస్థను చైనా,రష్యా రూపొందించిన S-300 నమూనా

చైనా రూపొందించిన HQ-9 క్షిపణి వ్యతిరేక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ముఖ్యంగా లాహోర్‌లో పాక్ సైనిక విభాగానికి ఎలాంటి గగనతల రక్షణ లేకుండా పోయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. HQ-9 వ్యవస్థను చైనా, రష్యా రూపొందించిన S-300 నమూనాను అనుసరించి అభివృద్ధి చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో వినియోగంలో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థ ఇదే. గమనించదగిన విషయం ఏంటంటే, గతంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ప్రయోగించిన క్షిపణులను HQ-9 వ్యవస్థ గుర్తించలేకపోయింది.

వివరాలు 

డ్రోన్ దాడులు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంగా జరిగాయి 

లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయానికి సమీపంగా గురువారం ఉదయం తీవ్రమైన పేలుళ్లు సంభవించాయి. దీని నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్లను విడిచి పరుగులు పెట్టారు. ఆ ప్రాంతంలో సైరన్లు మోగినట్లు స్థానిక వార్తా వర్గాలు తెలిపాయి. డ్రోన్ దాడులు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంగా జరిగాయని పాకిస్తాన్ వెల్లడించింది. ఫలితంగా, ఆ ప్రాంతంలో ఆర్మీ విభాగాలు, ఆర్థిక కేంద్రాలలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా లాహోర్, కరాచీ, సియాల్‌కోట్ విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లాహోర్‌లో ఈ ఉదయం డ్రోన్ అటాక్స్..