
India Pakistan Tension: పాక్ కి పెద్ద షాక్ ఇచ్చిన భారత్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
ఈ వార్తాకథనం ఏంటి
''ఆపరేషన్ సిందూర్''అనంతరం, భారత్ మరో కీలక దాడికి పాల్పడి పాకిస్తాన్కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్, రావల్పిండి, సియాల్కోట్ సహా పదకొండు నగరాలపై డ్రోన్ల ద్వారా దాడులు జరిగినట్లు సమాచారం.
ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యం పాక్ గగనతల రక్షణ వ్యవస్థలేనని తెలుస్తోంది.
దాంతో, ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా స్థంభించినట్లు తెలుస్తోంది.
భారత్పై పాక్ దాడులకు సిద్ధమవుతోందనే అనుమానంతోనే ఈ చర్యకు భారత్ పాల్పడినట్లు విశ్వసిస్తున్నారు.
వివరాలు
HQ-9 వ్యవస్థను చైనా,రష్యా రూపొందించిన S-300 నమూనా
చైనా రూపొందించిన HQ-9 క్షిపణి వ్యతిరేక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.
ముఖ్యంగా లాహోర్లో పాక్ సైనిక విభాగానికి ఎలాంటి గగనతల రక్షణ లేకుండా పోయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
HQ-9 వ్యవస్థను చైనా, రష్యా రూపొందించిన S-300 నమూనాను అనుసరించి అభివృద్ధి చేసింది.
ప్రస్తుతం పాకిస్తాన్ లో వినియోగంలో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థ ఇదే. గమనించదగిన విషయం ఏంటంటే, గతంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో భారత్ ప్రయోగించిన క్షిపణులను HQ-9 వ్యవస్థ గుర్తించలేకపోయింది.
వివరాలు
డ్రోన్ దాడులు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంగా జరిగాయి
లాహోర్లోని వాల్టన్ విమానాశ్రయానికి సమీపంగా గురువారం ఉదయం తీవ్రమైన పేలుళ్లు సంభవించాయి.
దీని నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్లను విడిచి పరుగులు పెట్టారు. ఆ ప్రాంతంలో సైరన్లు మోగినట్లు స్థానిక వార్తా వర్గాలు తెలిపాయి.
డ్రోన్ దాడులు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంగా జరిగాయని పాకిస్తాన్ వెల్లడించింది.
ఫలితంగా, ఆ ప్రాంతంలో ఆర్మీ విభాగాలు, ఆర్థిక కేంద్రాలలో గందరగోళం నెలకొంది.
ఈ పరిస్థితుల దృష్ట్యా లాహోర్, కరాచీ, సియాల్కోట్ విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లాహోర్లో ఈ ఉదయం డ్రోన్ అటాక్స్..
Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf
— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025